అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణతో వాల్తేరు వీరయ్యతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు బాబీ చేతులు కలుపుతున్న ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైపోయాయి. దానికి తగ్గట్టే దుల్కర్ సల్మాన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో ఎలాంటి కథ చూడబోతున్నామనే యాంగ్జైటి కలగడం సహజం. ఇవాళ చిన్న శాంపిల్ ని శివరాత్రి పండగ సందర్భంగా టీమ్ విడుదల చేసింది. అల్ట్రా స్టైలిష్ గా బాలయ్య ఒక జీపులో అడవికి వేటకు రావడంతో మొదలుపెట్టి చిన్న యాక్షన్ బ్లాక్ ని రివీల్ చేశారు.
సింహం నక్కలను తరుముతోందంటే అది వార్ కాదు వేటని చెప్పే డైలాగు బాగా పేలింది. బాలయ్య వెంట తెచ్చుకున్న పెట్టెలో శత్రువులను చంపే మారణాయుధాలతో పాటు ఆయన ఫెవరెట్ మ్యాన్షన్ హౌస్ ని పెట్టడం డిఫరెంట్ గా ఉంది. మొత్తం చీకటి బ్యాక్ డ్రాప్ లో రెడ్ లైటింగ్ విజువల్స్ బాబీ కొల్లి కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే తమన్ నాలుగోసారి వరసగా బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం దక్కింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కావడంతో తన కన్నా బెస్ట్ ఛాయస్ వేరే ఎందుకు అనుకుంటారు.
చిన్న గ్లిమ్ప్స్ అయినా మంచి వెయిట్ తీసుకొచ్చారు. విడుదల, టైటిల్ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏపీ ఎన్నికల దృష్ట్యా బాలకృష్ణ ఎక్కువ పర్యటనల్లో ఉంటున్నారు. రాబోయే నెల రోజులు కీలకం కావడంతో డేట్లు ఇవ్వడం కూడా కష్టమే. దసరా లేదా దీపావళికి రావొచ్చనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది కానీ ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ సెప్టెంబర్, అక్టోబర్ లో ముఖ్యమైన డేట్లను లాక్ చేసుకున్న దరిమిలా ఎన్బికె 109కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది.
This post was last modified on March 8, 2024 7:22 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…