అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణతో వాల్తేరు వీరయ్యతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు బాబీ చేతులు కలుపుతున్న ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైపోయాయి. దానికి తగ్గట్టే దుల్కర్ సల్మాన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో ఎలాంటి కథ చూడబోతున్నామనే యాంగ్జైటి కలగడం సహజం. ఇవాళ చిన్న శాంపిల్ ని శివరాత్రి పండగ సందర్భంగా టీమ్ విడుదల చేసింది. అల్ట్రా స్టైలిష్ గా బాలయ్య ఒక జీపులో అడవికి వేటకు రావడంతో మొదలుపెట్టి చిన్న యాక్షన్ బ్లాక్ ని రివీల్ చేశారు.
సింహం నక్కలను తరుముతోందంటే అది వార్ కాదు వేటని చెప్పే డైలాగు బాగా పేలింది. బాలయ్య వెంట తెచ్చుకున్న పెట్టెలో శత్రువులను చంపే మారణాయుధాలతో పాటు ఆయన ఫెవరెట్ మ్యాన్షన్ హౌస్ ని పెట్టడం డిఫరెంట్ గా ఉంది. మొత్తం చీకటి బ్యాక్ డ్రాప్ లో రెడ్ లైటింగ్ విజువల్స్ బాబీ కొల్లి కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే తమన్ నాలుగోసారి వరసగా బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం దక్కింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కావడంతో తన కన్నా బెస్ట్ ఛాయస్ వేరే ఎందుకు అనుకుంటారు.
చిన్న గ్లిమ్ప్స్ అయినా మంచి వెయిట్ తీసుకొచ్చారు. విడుదల, టైటిల్ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏపీ ఎన్నికల దృష్ట్యా బాలకృష్ణ ఎక్కువ పర్యటనల్లో ఉంటున్నారు. రాబోయే నెల రోజులు కీలకం కావడంతో డేట్లు ఇవ్వడం కూడా కష్టమే. దసరా లేదా దీపావళికి రావొచ్చనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది కానీ ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ సెప్టెంబర్, అక్టోబర్ లో ముఖ్యమైన డేట్లను లాక్ చేసుకున్న దరిమిలా ఎన్బికె 109కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది.
This post was last modified on March 8, 2024 7:22 pm
పరామర్శలు చేయడం తప్పుకాదు. పార్టీని కాపాడుకోవడమూ తప్పుకాదు. కానీ, ఎవరిని పరామర్శించాలన్న విషయంలోనే పార్టీలు విజ్ఞతతో ముందుకు సాగాలి. ఈ…
భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో…
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…