టాలీవుడ్ యువ నటుడు సుహాస్ను చూస్తే ఇతను హీరో ఏంటి అనిపిస్తుంది. కానీ లుక్స్ పరంగా సింపుల్ అనిపించినా.. తన సినిమాల్లో కంటెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. కలర్ ఫొటో, ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా అతను ముఖ్య పాత్రలు చేసిన సినిమాలన్నీ కూడా బలమైన కంటెంట్ ఉన్నవే. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అనే మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్.
అతడి సినిమాల సక్సెస్ రేట్ బాగుండడం.. సినిమా సినిమాకూ బిజినెస్ రేంజ్, సుహాస్ మీద ప్రేక్షకుల నమ్మకం పెరుగుతుండటంతో తన పారితోషకం కూడా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ప్రసన్న వదనం’ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు సినిమాకు మూడు కోట్లు తీసుకుంటున్నారట కదా అని సుహాస్ను అడిగితే అతను ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.
వరుసగా హిట్లు కొట్టడంతో రెమ్యూనరేషన్ పెంచారని అంటున్నారు కదా అని అడిగితే.. “ఏం పెంచొద్దా..? రోజుకు వంద రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి వచ్చాను. పెంచాలిగా మరి. ఏం నేను బతకొద్దా” అని సుహాస్ అన్నాడు. పారితోషకం మూడు కోట్లు అయిందట కదా అని అంటే.. పారితోషకం పెంచిన మాట వాస్తవం కానీ.. మూడు కోట్లు అనేది నిజం కాదన్నట్లుగా మాట్లాడాడు సుహాస్.
ఇక తన కెరీర్లో ఇప్పటిదాకా చేయనిది ‘ప్రసన్న వదనం’లో చేశానంటూ.. ఇందులో ఓ హీరోయిన్తో లిప్ టు లిప్ కిస్ సీన్ చేసినట్లు సుహాస్ వెల్లడించాడు. తన నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు వస్తున్నాయని.. అది కరెక్ట్ కాదని.. ఈ అక్టోబరు నుంచి కొంచెం స్పీడు తగ్గించి ఆచితూచి సినిమాలు చేస్తానని.. రిలీజ్కు, రిలీజ్కు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటానని సుహాస్ తెలిపాడు.
This post was last modified on March 7, 2024 10:40 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…