టాలీవుడ్ యువ నటుడు సుహాస్ను చూస్తే ఇతను హీరో ఏంటి అనిపిస్తుంది. కానీ లుక్స్ పరంగా సింపుల్ అనిపించినా.. తన సినిమాల్లో కంటెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. కలర్ ఫొటో, ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా అతను ముఖ్య పాత్రలు చేసిన సినిమాలన్నీ కూడా బలమైన కంటెంట్ ఉన్నవే. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అనే మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్.
అతడి సినిమాల సక్సెస్ రేట్ బాగుండడం.. సినిమా సినిమాకూ బిజినెస్ రేంజ్, సుహాస్ మీద ప్రేక్షకుల నమ్మకం పెరుగుతుండటంతో తన పారితోషకం కూడా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ప్రసన్న వదనం’ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు సినిమాకు మూడు కోట్లు తీసుకుంటున్నారట కదా అని సుహాస్ను అడిగితే అతను ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.
వరుసగా హిట్లు కొట్టడంతో రెమ్యూనరేషన్ పెంచారని అంటున్నారు కదా అని అడిగితే.. “ఏం పెంచొద్దా..? రోజుకు వంద రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి వచ్చాను. పెంచాలిగా మరి. ఏం నేను బతకొద్దా” అని సుహాస్ అన్నాడు. పారితోషకం మూడు కోట్లు అయిందట కదా అని అంటే.. పారితోషకం పెంచిన మాట వాస్తవం కానీ.. మూడు కోట్లు అనేది నిజం కాదన్నట్లుగా మాట్లాడాడు సుహాస్.
ఇక తన కెరీర్లో ఇప్పటిదాకా చేయనిది ‘ప్రసన్న వదనం’లో చేశానంటూ.. ఇందులో ఓ హీరోయిన్తో లిప్ టు లిప్ కిస్ సీన్ చేసినట్లు సుహాస్ వెల్లడించాడు. తన నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు వస్తున్నాయని.. అది కరెక్ట్ కాదని.. ఈ అక్టోబరు నుంచి కొంచెం స్పీడు తగ్గించి ఆచితూచి సినిమాలు చేస్తానని.. రిలీజ్కు, రిలీజ్కు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటానని సుహాస్ తెలిపాడు.
This post was last modified on March 7, 2024 10:40 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…