టాలీవుడ్లో తిరుగులేని విజయం సాధించిన మాస్ మసాలా సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. రాజమౌళి కెరీర్లో ఎదుగుతున్న దశలో రవితేజ హీరోగా ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ టైంకి దీని రేంజ్ తక్కువే. కానీ ఈ సినిమా ఊహించని స్థాయి విజయాన్నందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది.
‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ స్క్రిప్టులో భాగం అయ్యారు. కానీ ఈ సీక్వెల్ ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అందుక్కారణం.. రాజమౌళి రేంజ్ మారిపోయి ‘విక్రమార్కుడు’ లాంటి సగటు మాస్ మూవీకి సీక్వెల్ తీసే స్థితిలో లేకపోవడం. మరోవైపు హీరో రవితేజకు కూడా సీక్వెల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఐతే ‘విక్రమార్కుడు-2’ తీయాలని తనకెంతో కోరికగా ఉందని.. ఈ సినిమా స్క్రిప్టు కోసం ఖర్చు పెట్టుకున్న నిర్మాత కేకే రాధామోహన్ అంటున్నారు.
రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘భీమా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘విక్రమార్కుడు సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కేవలం నా కోసమే రూపొందింది. విక్రమార్కుడు-2 అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. కానీ సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉంది. రవితేజ గారు ఈ సినిమా విషయంలో ఆసక్తితో లేరు. నేను ముందు ఆయన్ని ఒప్పించాలి. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. నేను, సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ‘విక్రమార్కుడు-2’ స్క్రిప్ట్ మీద పని “చేశాం. కానీ ఇప్పుడు సంపత్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ గారు చేయకుండా విక్రమార్కుడు-2 ఉండదు. సరైన కాంబినేషన్ కుదరకుండా ఈ సినిమాను నేను నిర్మించను. ఏం జరుగుతుందో చూడాలి అని రాధామోహన్ తెలిపారు. మరి రవితేజ ఒప్పుకుని ఎప్పటికైనా ‘విక్రమార్కుడు-2’ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on March 7, 2024 7:18 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…