టాలీవుడ్లో తిరుగులేని విజయం సాధించిన మాస్ మసాలా సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. రాజమౌళి కెరీర్లో ఎదుగుతున్న దశలో రవితేజ హీరోగా ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ టైంకి దీని రేంజ్ తక్కువే. కానీ ఈ సినిమా ఊహించని స్థాయి విజయాన్నందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది.
‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ స్క్రిప్టులో భాగం అయ్యారు. కానీ ఈ సీక్వెల్ ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అందుక్కారణం.. రాజమౌళి రేంజ్ మారిపోయి ‘విక్రమార్కుడు’ లాంటి సగటు మాస్ మూవీకి సీక్వెల్ తీసే స్థితిలో లేకపోవడం. మరోవైపు హీరో రవితేజకు కూడా సీక్వెల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఐతే ‘విక్రమార్కుడు-2’ తీయాలని తనకెంతో కోరికగా ఉందని.. ఈ సినిమా స్క్రిప్టు కోసం ఖర్చు పెట్టుకున్న నిర్మాత కేకే రాధామోహన్ అంటున్నారు.
రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘భీమా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘విక్రమార్కుడు సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కేవలం నా కోసమే రూపొందింది. విక్రమార్కుడు-2 అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. కానీ సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉంది. రవితేజ గారు ఈ సినిమా విషయంలో ఆసక్తితో లేరు. నేను ముందు ఆయన్ని ఒప్పించాలి. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. నేను, సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ‘విక్రమార్కుడు-2’ స్క్రిప్ట్ మీద పని “చేశాం. కానీ ఇప్పుడు సంపత్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ గారు చేయకుండా విక్రమార్కుడు-2 ఉండదు. సరైన కాంబినేషన్ కుదరకుండా ఈ సినిమాను నేను నిర్మించను. ఏం జరుగుతుందో చూడాలి అని రాధామోహన్ తెలిపారు. మరి రవితేజ ఒప్పుకుని ఎప్పటికైనా ‘విక్రమార్కుడు-2’ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on March 7, 2024 7:18 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…