Movie News

విక్రమార్కుడు-2 స్క్రిప్టు రెడీ.. కానీ

టాలీవుడ్లో తిరుగులేని విజయం సాధించిన మాస్ మసాలా సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. రాజమౌళి కెరీర్లో ఎదుగుతున్న దశలో రవితేజ హీరోగా ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ టైంకి దీని రేంజ్ తక్కువే. కానీ ఈ సినిమా ఊహించని స్థాయి విజయాన్నందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది.

‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ స్క్రిప్టులో భాగం అయ్యారు. కానీ ఈ సీక్వెల్ ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అందుక్కారణం.. రాజమౌళి రేంజ్ మారిపోయి ‘విక్రమార్కుడు’ లాంటి సగటు మాస్ మూవీకి సీక్వెల్ తీసే స్థితిలో లేకపోవడం. మరోవైపు హీరో రవితేజకు కూడా సీక్వెల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఐతే ‘విక్రమార్కుడు-2’ తీయాలని తనకెంతో కోరికగా ఉందని.. ఈ సినిమా స్క్రిప్టు కోసం ఖర్చు పెట్టుకున్న నిర్మాత కేకే రాధామోహన్ అంటున్నారు.

రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘భీమా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘విక్రమార్కుడు సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కేవలం నా కోసమే రూపొందింది. విక్రమార్కుడు-2 అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. కానీ సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉంది. రవితేజ గారు ఈ సినిమా విషయంలో ఆసక్తితో లేరు. నేను ముందు ఆయన్ని ఒప్పించాలి. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. నేను, సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ‘విక్రమార్కుడు-2’ స్క్రిప్ట్ మీద పని “చేశాం. కానీ ఇప్పుడు సంపత్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ గారు చేయకుండా విక్రమార్కుడు-2 ఉండదు. సరైన కాంబినేషన్ కుదరకుండా ఈ సినిమాను నేను నిర్మించను. ఏం జరుగుతుందో చూడాలి అని రాధామోహన్ తెలిపారు. మరి రవితేజ ఒప్పుకుని ఎప్పటికైనా ‘విక్రమార్కుడు-2’ పట్టాలెక్కుతుందేమో చూడాలి.

This post was last modified on March 7, 2024 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago