ఇటీవలే విడుదలైన రామ్ గోపాల్ వర్మ వ్యూహంని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. పొలిటికల్ స్పూఫ్ లు యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో బాగుంటాయి కానీ ఇలా టికెట్లు అమ్మి థియేటర్లో చూడమంటే కష్టమని మరోసారి ఋజువు చేశారు. గతంలో కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలకు ఇదే పరాభవం ఎదురైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వర్మ వీటిని తీయడం మానుకోలేదు. వ్యూహంకి కనీసం వైసిపి అభిమానులను నుంచి సైతం మద్దతు దక్కలేదు. అయినా యాత్ర 2నే కాపాడలేని ఫాలోయర్స్ దీనికి మాత్రం ఏం చేయగలరు.
ఇంత జరిగినా వ్యూహం సీక్వెల్ శపథం రిలీజ్ కు రెడీ అవుతోంది. వాస్తవానికి ఇది మార్చి 8 వచ్చేయాలి. కానీ సెన్సార్ ఆలస్యం కావడంతో ఇంకో వారం వాయిదా వేసేలా ఉన్నారు. వ్యూహం దాదాపు నిర్మాత స్వంతంగా పంపిణి చేసుకున్నారట కానీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు లేకపోలేదు. వ్యూహం ద్వారా వచ్చిన నష్టాల గురించి అడిగినప్పుడు శపథంకి సహకరిస్తే దాని ద్వారా వచ్చే సొమ్ముని ఏదోలా సర్దుతామని చెబుతున్నారట. అయినా మొదటి భాగాన్ని ఎవరూ పట్టించుకోనప్పుడు అదే పనిగా సెకండ్ పార్ట్ చూసేందుకు డబ్బులిచ్చి వస్తారా అనేది వేయి డాలర్ల ప్రశ్న.
ఇవి ఆడినా ఆడకపోయినా వర్మకు పెద్ద తేడా పడదు కానీ వ్యూహంని వీలైనంత త్వరగా ఓటిటిలో వదిలేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు కొన్ని పే పర్ వ్యూ మోడల్ లో వదిలి విమర్శలు అందుకున్న వర్మ ఈసారి అదే రిపీట్ చేస్తారో లేక ఏదైనా ఓటిటిలో ఫ్రీ స్టీమింగ్ కి వదిలి పెడతారో చూడాలి. ఎన్నికల ప్రచారానికి వ్యూహం, శపథం కంటెంట్లను వాడుకోవచ్చని చూసిన అధికార పార్టీ అనుచరులకు అవి ఎంత మాత్రం ఉపయోగపడేలా కనిపించకపోవడంతో లైట్ తీసుకున్నారు. అన్నట్టు శపథంకి కొనసాగింపుగా ఇంకో సినిమా తీస్తానని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు.
This post was last modified on March 6, 2024 9:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…