కాకతాళీయంగా అనిపిస్తున్నా ఆర్ఆర్ఆర్ స్నేహితులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఎదురవుతున్న పరిణామాల్లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరికీ గ్యాప్ వచ్చేసింది. ఎంత వేగంగా తీద్దామనుకున్నా నిర్మాణంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ విడుదల గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. షూటింగ్ ఆలస్యంగా మొదలైన దేవర ఏప్రిల్ లో రావాలని విశ్వప్రయత్నం చేసి చివరికి సాధ్యం కాక అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది. అప్పుడైనా గ్యారెంటీనా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
చరణ్ మధ్యలో ఆచార్య చేశాడు కానీ అది క్యామియో కావడం వల్ల కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరి సినిమాల్లో ఎంపిక కావడం ఇంకో అనూహ్యమని చెప్పాలి. దేవరలో ముందు నటించింది. అందులో తన గెటప్, నటనకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తారక్ ద్వారా దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ లకు చేరడంతో ఇంకో ఆలోచన చేయకుండా ఆర్సి 16కి లాక్ చేసుకున్నారు. న్యూస్ ఎప్పుడో లీకైనా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇలా తారక్, చరణ్ ల సరసన ఏకకాలంలో నటిస్తున్న క్రెడిట్ తో జాన్వీ కపూర్ ఎంట్రీ టాలీవుడ్ లో గ్రాండ్ గా జరగనుంది.
ఫ్రెండ్స్ కాబట్టి ఇన్నిరకాల సారూప్యతలు వస్తున్నాయని అనుకోవాలి. దేవర తర్వాత తారక్ బాలీవుడ్ లో వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో వైపు చరణ్ తో ఒక భారీ ప్రాజెక్టు చేసేందుకు ఒకరిద్దరు పేరు మోసిన హిందీ దర్శకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి . ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ ఉంటుందనే ప్రచారం గతంలో జరిగినా అదేమీ లేదని అర్థమైపోయింది. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు 29తో బిజీ అయిపోయాడు. కనీసం రెండు మూడేళ్లు పట్టేలా ఉంది. ఆ తర్వాతైనా ట్రిపులార్ కొనసాగింపు జరగడం కష్టమే.
This post was last modified on March 6, 2024 3:41 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…