Movie News

జీవిత మౌనానికి కారణం?


తెలుగులో ఒకప్పుడు తనదైన ముద్ర వేసిన అచ్చ తెలుగు హీరోయిన్లలో జీవిత ఒకరు. 80వ దశకంలో ఆమె చేసిన అనేక సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘అంకుశం’ సినిమా చేస్తూ రాజశేఖర్‌తో ప్రేమలో పడిన ఆమె కొంత కాలానికి ఆయన్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది. ఆ తర్వాత నటనకు దూరం అయిన ఆమె.. తర్వాత ప్రొడక్షన్, డైరెక్షన్లో భాగమైంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాల్లో రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించింది.

ఐతే ఔట్ స్పోకెన్ అయిన జీవిత చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకుని కోర్టు జైలు శిక్ష విధించే వరకు వెళ్లింది. ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డ జీవిత.. కొన్నాళ్లుగా అస్సలు మీడియాలో కనిపించడం లేదు.

తాను ఉద్దేశపూర్వకంగానే దేని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నట్లు జీవిత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది తన కూతుళ్ల కెరీర్ల కోసమే అని ఆమె వెల్లడించింది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు దాటింది. ఎన్నో ఒడుదొడుకులను దాటి ఒక స్థాయికి చేరుకున్నా. నేను ఏదైనా ఉన్నదున్నట్లు మాట్లాడేస్తాను. అది అందరికీ నచ్చదు. అందుకే ఎక్కువ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. మనం అన్నింటి మీదా స్పందించనంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు కదా అనిపించింది.

ఇప్పుడు నా పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చారు. నేనేదైనా మాట్లాడి వివాదాస్పదం అయితే అది వాళ్ల కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అనిపించింది. అందుకే మా కారణంగా వాళ్లు ఇబ్బంది పడకూడదని నాతో పాటు మా ఆయన కూడా మౌనంగా ఉంటున్నాం. కానీ అది భయం కాదు. మేమిప్పుడు హాయిగా ఉన్నాం’’ అని జీవిత చెప్పింది. జీవిత చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే రజినీకాంత్ సినిమా ‘లాల్ సలాం’తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

This post was last modified on March 5, 2024 6:05 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

22 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

51 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago