బాలీవుడ్ మల్టీస్టారర్ వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు తెరను పంచుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు తీరుతెన్నులు ఎలా ఉంటాయనే దాని మీద ఉన్న సస్పెన్స్ మెల్లగా వీడుతోంది. టైగర్ 3 ఎండ్ టైటిల్స్ అయ్యాక హృతిక్ తో అషుతోష్ రానా చేసే ఫోన్ సంభాషణలో విలన్ గురించి చెబుతాడు. అది తారక్ క్యారెక్టరేననే ప్రచారం ఒక దశలో జరిగింది. కానీ అదేదీ నిజం కాదు. వార్ 2లో యంగ్ టైగర్ అత్యంత బాధ్యత కలిగిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా నటించబోతున్నాడు. ఎలాంటి ప్రతికూల ఛాయలు లేకుండా రచయిత కం నిర్మాత ఆదిత్య చోప్రా ఈ పాత్రను డిజైన్ చేశారట.
మరి హృతిక్ తో తనకు ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్. ఈ వారంలోనే జపాన్ దేశంలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ ఇది పూర్తవ్వగానే వార్ 2 సెట్స్ లో అడుగు పెడతాడు. ఈలోగా హృతిక్ రోషన్ కు సంబంధించిన సింగల్ సీన్లు ఫినిష్ చేస్తారు. అయితే ట్విస్టు ఇక్కడితో అయిపోలేదు. ఏజెంట్ గా కనిపించే తారక్ తర్వాత ఇదే క్యారెక్టర్ తో ఒక ఫుల్ మూవీ, అదయ్యాక టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి యష్ స్పై యూనివర్స్ లో వచ్చే సినిమాల్లోనూ కనిపిస్తాడట. సో ఇదేదో ఆషామాషీ ప్లాన్ అయితే కాదు.
మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ఇంకా తెలియనున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఏడాది లోపే షూట్ పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ ఆల్రెడీ ఎంపికయ్యింది. యష్ సంస్థ తమ గూఢచారి సిరీస్ లో పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్, అలియా భట్ చేయబోయే టైటిల్ నిర్ణయించని లేడీ స్పై మూవీ, టైగర్ 4 వరసగా ప్లాన్ చేసుకుంది. వార్ 3 కూడా ఉంటుందట. తారక్ సింగల్ గా నటించే సినిమాకు ఆ పాత్ర పేరే పెడతారు కానీ అదింకా లీక్ కాలేదు. మొత్తానికి బాలీవుడ్ లో బడా ప్లాన్లు వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది.
This post was last modified on March 5, 2024 8:14 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…