ఒక పెద్ద సీనియర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు. పాత్ర చిన్నదో పెద్దదో ఒక్కసారి స్క్రీన్ మీద కాంబినేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకునే వాళ్లే ఎక్కువ. కానీ న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ల ఆలోచన, పద్ధతి ఈ విషయంలో మాత్రం ఒకటేనని చెప్పాలి. ముందు నాని సంగతి చూస్తే కొన్ని నెలల క్రితం రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయ్యాన్ లో ఒక ముఖ్యమైన పాత్రని ఆఫర్ చేశారు. బాగా ఆలోచించిన నాని ఇది తనకు నప్పేది, ఉపయోగపడేది కాదని గుర్తించి గుర్తించి సున్నితంగా నో చెప్పాడు.
అది కాస్తా దగ్గుబాటి రానాని వరించింది. జీవితంలో మళ్ళీ రజనితో కలిసి నటించే ఛాన్స్ రావొచ్చు రాకపోవచ్చు. కానీ నాని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే వద్దనుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కూడా ఇదే అవలంబించాడు. 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ మణిరత్నంల లెజెండరీ కాంబోలో రూపొందుతున్న తగ్ లైఫ్ కి ఫస్ట్ ఓకే చెప్పాడు. కానీ తాజాగా కాల్ షీట్స్ సమస్య వల్ల ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వచ్చిన తాజా అప్డేట్ ఫ్యాన్స్ ని షాక్ గురి చేసింది. కమల్ అంటే దుల్కర్ తండ్రి, కేరళ మెగాస్టార్ మమ్ముట్టి సమకాలికుడు.
ఒకరకంగా చెప్పాలంటే చాలా అరుదైన అవకాశం. అయినా సరే కమిట్ మెంట్లను దృష్టిలో ఉంచుకుంది హుందాగా పక్కకు వచ్చాడు. దీన్ని బట్టే కెరీర్ ప్లానింగ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కమల్, రజని ఆరు పదుల వయసు దాటేసి వేగంగా సినిమాలు చేయడంలో పరుగులు పెడుతున్నారు. ఇంకెన్ని నటిస్తారో చెప్పలేం కానీ వాళ్ళతో క్యాస్టింగ్ లో భాగం కావడమనేది అదృష్టంగా భావిస్తారు. కానీ నాని, దుల్కర్ లు మాత్రం క్రేజ్ గురించి పట్టించుకోకుండా ఇంత స్పష్టంగా ఆలోచించడం విశేషమే. నాని సరిపోదా శనివారం, దుల్కర్ లక్కీ భాస్కర్ లతో బిజీగా ఉన్నారు.
This post was last modified on March 5, 2024 12:02 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…