ఒక పెద్ద సీనియర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు. పాత్ర చిన్నదో పెద్దదో ఒక్కసారి స్క్రీన్ మీద కాంబినేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకునే వాళ్లే ఎక్కువ. కానీ న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ల ఆలోచన, పద్ధతి ఈ విషయంలో మాత్రం ఒకటేనని చెప్పాలి. ముందు నాని సంగతి చూస్తే కొన్ని నెలల క్రితం రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయ్యాన్ లో ఒక ముఖ్యమైన పాత్రని ఆఫర్ చేశారు. బాగా ఆలోచించిన నాని ఇది తనకు నప్పేది, ఉపయోగపడేది కాదని గుర్తించి గుర్తించి సున్నితంగా నో చెప్పాడు.
అది కాస్తా దగ్గుబాటి రానాని వరించింది. జీవితంలో మళ్ళీ రజనితో కలిసి నటించే ఛాన్స్ రావొచ్చు రాకపోవచ్చు. కానీ నాని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే వద్దనుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కూడా ఇదే అవలంబించాడు. 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ మణిరత్నంల లెజెండరీ కాంబోలో రూపొందుతున్న తగ్ లైఫ్ కి ఫస్ట్ ఓకే చెప్పాడు. కానీ తాజాగా కాల్ షీట్స్ సమస్య వల్ల ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వచ్చిన తాజా అప్డేట్ ఫ్యాన్స్ ని షాక్ గురి చేసింది. కమల్ అంటే దుల్కర్ తండ్రి, కేరళ మెగాస్టార్ మమ్ముట్టి సమకాలికుడు.
ఒకరకంగా చెప్పాలంటే చాలా అరుదైన అవకాశం. అయినా సరే కమిట్ మెంట్లను దృష్టిలో ఉంచుకుంది హుందాగా పక్కకు వచ్చాడు. దీన్ని బట్టే కెరీర్ ప్లానింగ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కమల్, రజని ఆరు పదుల వయసు దాటేసి వేగంగా సినిమాలు చేయడంలో పరుగులు పెడుతున్నారు. ఇంకెన్ని నటిస్తారో చెప్పలేం కానీ వాళ్ళతో క్యాస్టింగ్ లో భాగం కావడమనేది అదృష్టంగా భావిస్తారు. కానీ నాని, దుల్కర్ లు మాత్రం క్రేజ్ గురించి పట్టించుకోకుండా ఇంత స్పష్టంగా ఆలోచించడం విశేషమే. నాని సరిపోదా శనివారం, దుల్కర్ లక్కీ భాస్కర్ లతో బిజీగా ఉన్నారు.
This post was last modified on March 5, 2024 12:02 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…