ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ను హీరోగా పరిచయం చేయడానికి కొన్నేళ్ల ముందే ప్రయత్నాలు మొదలు కాగా.. అతను హీరోగా పరిచయం కావాల్సిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఏవో కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఐతే ఆ తర్వాత పెద్దగా హడావుడి లేకుండా ‘మ్యాడ్’ మూవీలో ముగ్గురు హీరోల్లో ఒకడిగా కనిపించి లాంఛనాన్ని పూర్తి చేశాడు నితిన్. ఈ సినిమా మంచి హిట్టయింది కానీ నితిన్కు పెద్దగా పేరైతే రాలేదు. సంగీత్ శోభన్ డామినేషన్తో నితిన్ వెనకబడిపోయాడు.
ఇప్పుడు నార్నె నితిన్ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేసే బాధ్యతను గీతా ఆర్ట్స్-2 తీసుకుంది. ఈ సంస్థలో నితిన్ చేస్తున్న సినిమాకు తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘ఆయ్’ అనే ఫన్నీ టైటిల్ను ఈ చిత్రానికి ఖరారు చేశారు.
అంజి కంచిపల్లి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్మెంట్ కొంచెం భిన్నంగా చేసింది చిత్ర బృందం. కొత్త దర్శకులు సినిమాలు తీయడంలోనే కాదు.. టైటిల్ పెట్టడంలోనూ లేటే అని విసుక్కుంటూ బన్నీ వాసు డైరెక్టర్ అంజికి ఫోన్ చేయడం.. అతను తమాషాగా ‘ఆయ్’ అనే టైటిల్ చెప్పడం.. అది అర్థం కాక బన్నీ వాసు హీరో హీరోయిన్లను లైన్లో తీసుకోవడం.. చివరికి ‘ఆయ్’ అన్నదే టైటిల్ అని డైరెక్టర్ రివీల్ చేయడం.. సూపర్ హిట్ టైటిల్ పెట్టావని అప్రిషియేట్ చేస్తూ సమ్మర్లో కుమ్మేద్దాం అని బన్నీ వాసు అనడంతో వీడియో ముగిసింది.
‘ఆయ్’ అనే టైటిల్కు ‘మేం ఫ్రెండ్సండీ’ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ నెల 7న ‘ఆయ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. బన్నీ వాసుతో కలిసి విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
This post was last modified on March 4, 2024 3:22 pm
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…