ఒక కాలంలో థియేటర్లో ఆడని సినిమాలు తర్వాత జనరేషన్ లో కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడం ఈ మధ్య చూస్తున్నాం. ఆరంజ్, ఓయ్ లాంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సరే ఇవంటే మరీ పాతవి కాదు కాబట్టి ఏదో అనుకోవచ్చు. ఎప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఫ్లాప్ మూవీకి ఇప్పుడు ఆదరణ దక్కడమంటే అరుదే. అదెలాగో చూద్దాం. ఇటీవలే మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ ప్రధానంగా కొడైకెనాల్ లోని ఒక గుహలో జరిగే సంగతి తెలిసిందే. దర్శకుడు చిదంబరం తీసుకున్న మెయిన్ పాయింట్ వెనుక ఓ కథుంది.
1991లో విడుదలైన కమల్ హాసన్ గుణ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. మానసిక స్థితి సరిగా లేని యువకుడు ప్రాణహాని ఉన్న ధనవంతురాలైన హీరోయిన్ ని అనుకోని పరిస్థితుల వల్ల తీసుకెళ్లి ఒక గుహలో దాచి ప్రాణంగా చూసుకుంటాడు. ఆమెని దేవతలా భావించి ప్రేమిస్తాడు. గుహలో ఉన్నప్పుడే ఇళయరాజా స్వరపరిచిన ‘కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే’ పాట పాడుకుంటారు. సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్ లవర్స్ ని ఓలలాడించింది. దీన్నే బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా మంజుమ్మెల్ బాయ్స్ తీశారు.
దెబ్బకు పాత గుణని వెతికి మరీ చూడటం మొదలుపెట్టారు మంజుమ్మెల్ బాయ్స్ ని ఇష్టపడిన కుర్రకారు. యూట్యూబ్, పలు వెబ్ సైట్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇటీవలే ఒక శాటిలైట్ ఛానల్ రీ మాస్టర్ చేసిన ప్రింట్ ని ప్రీమియర్ గా ప్రసారం చేసింది. అప్పుడు తిరస్కారానికి గురైన గుణకి తర్వాతి రోజుల్లో కల్ట్ స్టేటస్ ఎందుకు వచ్చిందో క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. నటుడు సంతాన భారతి దర్శకత్వం వహించిన గుణ తెలుగులో కూడా డిజాస్టరే. అయినా సరే విమర్శకుల ప్రశంసలు, పలు అవార్డులు రివార్డులు దక్కించుకుంది. తెలుగులో మార్చి 15 మంజుమ్మెల్ బాయ్స్ వస్తోంది.
This post was last modified on March 4, 2024 2:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…