అందం, అభినయం రెండూ ఉన్నా సరైన బ్రేక్ కోసం ఎదురు చూసిన మీనాక్షి చౌదరికి ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంలో నటించిన ఆనందం రవ్వంత కూడా మిగల్లేదు. ఫలితం సంగతి పక్కనపెడితే అందులో ఆమెకు దక్కిన ప్రాధాన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం హీరో, దర్శకుడు కాంబో చూసి గుడ్డిగా ఒప్పేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని అర్థమైపోయింది కాబోలు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తన చేతిలో వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విజయ్ గోట్ సెట్స్ మీద ఉన్నాయి.
ఇవి కాకుండా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సంక్రాంతికి వస్తున్నాం (ప్రచారంలో ఉన్న టైటిల్) లో తననే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. చిరంజీవి విశ్వంభర ఆఫర్ కు ఓకే చెప్పిందనే ప్రచారం మొన్నటి నుంచే తిరిగుతోంది. ఈ రెండూ ఒప్పేసుకుంటే కెరీర్ పరంగా వేగం మొదలైనట్టే. భగవంత్ కేసరి మినహాయించి శ్రీలీలకు గత ఆరు నెలల కాలంలో మూడు డిజాస్టర్లు, ఒక ఎబోవ్ యావరేజ్ పడ్డాయి. దీంతో పీక్స్ డిమాండ్ లో చిన్నగా తగ్గుదల మొదలైంది. దర్శకులు ఇతర ఆప్షన్లు చూడటం మొదలుపెట్టారు.
మీనాక్షి చౌదరి లాంటి వాళ్ళు ఈ స్పేస్ ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఇప్పుడు తనే ముందుంది. విశ్వక్ సేన్ తో గత ఏడాదే ఒక సినిమా మొదలైంది కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. వీటిలో కనీసం రెండు మూడు హిట్ అయినా చాలు ఒక్కసారిగా లక్కు మారిపోయి కెరీర్ ఊపందుకుంటుంది. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో ఆఫర్ దక్కడమే అతి పెద్ద ప్రమోషనని చెప్పాలి. వర్కౌట్ అయితే మాత్రం తమిళ తెలుగులో రెండు భాషల్లో యమా బిజీ అయిపోవచ్చు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…