టాలీవుడ్ కు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాట వైబ్రేషన్లు ఇప్పట్లో వదిలేలా లేవు. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ సాహిత్యంతో ఆ పాట చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం సాంగ్ వల్ల వచ్చిందని మాత్రం చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా లయబద్దంగా స్టెప్పులు వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చేది కాదన్నది వాస్తవం. గతంలో నాటు నాటుని మించిన పాటలు ఎన్నో వచ్చాయి. గుర్తింపు దక్కడంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ నాటు నాటుకి రాజమౌళి బృందం తీసుకొచ్చిన హైప్ మాత్రం మాటల్లో కొలవలేనిది.
దీనికి మరింత బలం చేకూర్చేలా జరిగిన సంఘటన ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. పెళ్లికి ఇంకో నాలుగు నెలలు టైం ఉన్నా ముందస్తు వేడుకనే ఈ స్థాయిలో జరపడం చూసి ప్రపంచ మీడియా సైతం నివ్వెరబోతోంది. నిన్న రాత్రి జరిగిన సంగీత్ తరహా ఫంక్షన్ లో బాలీవుడ్ ఖాన్ల ద్వయం అమీర్ ఖాన్ – షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ ముగ్గురూ నాటు నాటు పాటకు తారక్ చరణ్ లాగే స్టెప్పులు వేయడం చూసి ప్రాంగణం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
ఇలాంటి అరుదైన దృశ్యం చూసినప్పుడు తెలుగు వాడి ఛాతి పొంగకుండా ఎలా ఉంటుంది. వరల్డ్ టాప్ ఈవెంట్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న అనంత్ అంబానీ వెడ్డింగ్ లో ఇండియా మోస్ట్ వాంటెడ్ స్టార్స్ అందరూ నాటు నాటు అంటూ గెంతులు వేయడం కన్నా రాజమౌళి లాంటి ఫిలిం మేకర్ కి కావాల్సింది ఏముంటుంది. సౌత్ సినిమానాని ఒకప్పుడు చులకనగా చూసే కోణాన్ని ఇంత సమూలంగా మార్చిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇదొక్కటే కాదు పుష్పలో ఊ అంటావా ఊహూ అంటావాకు కూడా పలువురు స్టార్లు కాలు కదిపారని లైవ్ లో చూసిన వాళ్ళ స్పెషల్ రిపోర్ట్.
This post was last modified on March 3, 2024 7:52 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…