సరే ఏజెంట్ పోయింది. డిజాస్టర్ కన్నా దారుణంగా దాని గురించి మాట్లాడుకున్నారు. ఇదంత ప్రతి హీరోకు ఏదో ఒక దశలో ఎదురయ్యే అనుభవమే. చరిత్రలో ఎవరూ మినహాయింపు కాదు. కానీ అఖిల్ మాత్రం ఇంకా దాని తాలూకు గాయాల నుంచి బయటికి వచ్చాడో లేదోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పదకొండు నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్ లో ఏజెంట్ ఫస్ట్ యానివర్సరీ వస్తుంది. అయినా సరే ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టలేదు. నాన్న నా సామిరంగతో తిరిగి ట్రాక్ లో పడ్డారు. అన్నయ్య నాగ చైతన్య తండేల్ మీద క్రమంగా బజ్ పెరుగుతోంది.
ఎటొచ్చి అఖిల్ మాత్రం కెమెరా ముందుకు రావడం లేదు. తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో యమా ఉత్సాహంగా పాల్గొని టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషించాల్సిన విషయమే అయినా దాని వల్ల కెరీర్ పరంగా వచ్చే ప్రయోజనం శూన్యం. సరదాగా ఆడే ఆటే తప్పించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది చేయబోయే సినిమాల మీద. యువి క్రియేషన్స్ బ్యానర్ మీద అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఎప్పుడో ఓకే అయ్యింది. అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు తప్పించి ఫలానా టైంలో స్టార్ట్ చేస్తామని చెప్పడం లేదు.
చాలా లేట్ గా ఓకే అయిన చిరంజీవి విశ్వంభరని ఇదే యూవీ సంస్థ వేగంగా పరుగులు పెట్టిస్తోంది. అనుష్క దర్శకుడు క్రిష్ కాంబోలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికీ రూట్ క్లియర్ చేశారు. కానీ అఖిల్ ది మాత్రం ముందుకు తీసుకెళ్లడం లేదు. స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి కలగనందు వల్లే ;లేట్ అవుతోందని, ఫైనల్ వెర్షన్ అందరికీ నచ్చగానే సెట్స్ పైకి వెళ్తుందని ఇన్ సైడ్ టాక్. బడ్జెట్ తగ్గించే దిశగా కొంత వర్క్ జరుగుతోందట. అఖిల్ ఇంతకంటే ఆలస్యం చేయకూడదు. హిట్టో ఫ్లాపో వరసగా చేసుకుంటూ పోవడమే ఒక లెగసిని మోస్తున్న అఖిల్ లాంటి హీరోలు చేయాల్సింది.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…