ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన దృశ్యం హాలీవుడ్ లో రీమేక్ కాబోతోందనే వార్త నిన్న సోషల్ మీడియాని ఊపేసింది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ తరువాత ఇతర భాషల్లో వెంకటేష్, అజయ్ దేవగన్, రవి చంద్రన్ లాంటి బడా స్టార్లు కోరిమరీ రీమేక్ చేసుకుని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఒక సౌత్ మూవీని మొట్టమొదటి సారి ఇంగ్లీష్ లో తీస్తున్నారనే కామెంట్ మాత్రం నిజం కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ ఘనత పన్నెండేళ్ల క్రితం మన తెలుగు దర్శకుడు ఒక ఎమోషనల్ మూవీతో సాధించాడు. అదేంటో చూద్దాం.
1997లో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా జంటగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆహ్వానం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. భార్యకు ఇష్టం లేకపోయినా భర్త విడాకులు కోరుతున్నప్పుడు పెళ్లి లాగే విడిపోయే తతంగం కూడా ఊరందరి ముందు జరగాలనే విభిన్నమైన పాయింట్ ని తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ కి మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు. స్పెషల్ జ్యురీ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది. పదిహేనేళ్ల తర్వాత 2012లో ఇదే ఆహ్వానాన్ని హాలీవుడ్ లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ పేరుతో రీమేక్ చేశారు. జోనాథన్ బెన్నెట్, జామీ హీరో హీరోయిన్లు గా నటించారు.
ఎస్వి కృష్ణారెడ్డినే దర్శకత్వం వహించారు. 2012 నవంబర్ 15 రిలీజయ్యింది. అమెరికా జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు కానీ మేకింగ్ పరంగా పేరు వచ్చింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆయన ఇవి వేరువేరని చెప్పారు కానీ మూల కథ ఒకటేనని రెండు చూసినవాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం కన్నా ముందు ఈ రీమేక్ రికార్డు ఆహ్వానంకు చెందుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ కూడా హిట్ అయ్యుంటే మన జనాలకు గుర్తుండేది కానీ ఫలితం వల్ల అందరూ మర్చిపోయారు. అయితే దృశ్యం పదికి పైనే భాషల్లో రీమేక్ కావడం వల్ల ఆహ్వానం కంటే పైనే ఉందని చెప్పాలి.
This post was last modified on March 1, 2024 1:53 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…