ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన దృశ్యం హాలీవుడ్ లో రీమేక్ కాబోతోందనే వార్త నిన్న సోషల్ మీడియాని ఊపేసింది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ తరువాత ఇతర భాషల్లో వెంకటేష్, అజయ్ దేవగన్, రవి చంద్రన్ లాంటి బడా స్టార్లు కోరిమరీ రీమేక్ చేసుకుని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఒక సౌత్ మూవీని మొట్టమొదటి సారి ఇంగ్లీష్ లో తీస్తున్నారనే కామెంట్ మాత్రం నిజం కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ ఘనత పన్నెండేళ్ల క్రితం మన తెలుగు దర్శకుడు ఒక ఎమోషనల్ మూవీతో సాధించాడు. అదేంటో చూద్దాం.
1997లో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా జంటగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆహ్వానం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. భార్యకు ఇష్టం లేకపోయినా భర్త విడాకులు కోరుతున్నప్పుడు పెళ్లి లాగే విడిపోయే తతంగం కూడా ఊరందరి ముందు జరగాలనే విభిన్నమైన పాయింట్ ని తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ కి మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు. స్పెషల్ జ్యురీ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది. పదిహేనేళ్ల తర్వాత 2012లో ఇదే ఆహ్వానాన్ని హాలీవుడ్ లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ పేరుతో రీమేక్ చేశారు. జోనాథన్ బెన్నెట్, జామీ హీరో హీరోయిన్లు గా నటించారు.
ఎస్వి కృష్ణారెడ్డినే దర్శకత్వం వహించారు. 2012 నవంబర్ 15 రిలీజయ్యింది. అమెరికా జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు కానీ మేకింగ్ పరంగా పేరు వచ్చింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆయన ఇవి వేరువేరని చెప్పారు కానీ మూల కథ ఒకటేనని రెండు చూసినవాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం కన్నా ముందు ఈ రీమేక్ రికార్డు ఆహ్వానంకు చెందుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ కూడా హిట్ అయ్యుంటే మన జనాలకు గుర్తుండేది కానీ ఫలితం వల్ల అందరూ మర్చిపోయారు. అయితే దృశ్యం పదికి పైనే భాషల్లో రీమేక్ కావడం వల్ల ఆహ్వానం కంటే పైనే ఉందని చెప్పాలి.
This post was last modified on March 1, 2024 1:53 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…