ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ.. దృశ్యం. ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్గా ఈ సినిమాను జీతు జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భారతీయ భాషల్లో ‘దృశ్యం’ను రీమేక్ చేశారు. బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు. ఇలా రీమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావడం ఆ కథ ప్రత్యేకత.
విశేషం ఏంటంటే.. ‘దృశ్యం’ విదేశీ భాషల్లోనూ రీమేక్ అయి సక్సెస్ సాధించింది. శ్రీలంక అధికార భాష అయిన సింహళీలో.. అలాగే చైనీస్, కొరియన్ భాషల్లోనూ ‘దృశ్యం’ను రీమేక్ చేయగా.. అక్కడా మంచి స్పందన వచ్చింది. ఇదే విశేషం అంటే.. ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్లబోతోంది దృశ్యం స్టోరీ.
హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించబోతోంది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. పనోరమ స్టూడియోస్ నుంచి వాళ్లు రీమేక్ హక్కులు తీసుకున్నారు.
హాలీవుడ్ నుంచి అధికారిక రీమేక్లకు తోడు బోలెడన్ని ఫ్రీమేక్లు మన స్క్రీన్ మీదికి వచ్చేస్తుంటాయి. కానీ మన కథ నచ్చి హాలీవుడ్లో రీమేక్ చేయడానికి అధికారికంగా హక్కులు తీసుకోవడం అన్నది ఊహకందని విషయం. ఇది ఇండియన్ సినిమాకే గర్వకారణం. ‘దృశ్యం’ ఎంతటి సార్వజనీనమైన కథ అనడానికి ఇది ఉదాహరణ. మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందేమో చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…