ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ.. దృశ్యం. ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్గా ఈ సినిమాను జీతు జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భారతీయ భాషల్లో ‘దృశ్యం’ను రీమేక్ చేశారు. బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు. ఇలా రీమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావడం ఆ కథ ప్రత్యేకత.
విశేషం ఏంటంటే.. ‘దృశ్యం’ విదేశీ భాషల్లోనూ రీమేక్ అయి సక్సెస్ సాధించింది. శ్రీలంక అధికార భాష అయిన సింహళీలో.. అలాగే చైనీస్, కొరియన్ భాషల్లోనూ ‘దృశ్యం’ను రీమేక్ చేయగా.. అక్కడా మంచి స్పందన వచ్చింది. ఇదే విశేషం అంటే.. ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్లబోతోంది దృశ్యం స్టోరీ.
హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించబోతోంది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. పనోరమ స్టూడియోస్ నుంచి వాళ్లు రీమేక్ హక్కులు తీసుకున్నారు.
హాలీవుడ్ నుంచి అధికారిక రీమేక్లకు తోడు బోలెడన్ని ఫ్రీమేక్లు మన స్క్రీన్ మీదికి వచ్చేస్తుంటాయి. కానీ మన కథ నచ్చి హాలీవుడ్లో రీమేక్ చేయడానికి అధికారికంగా హక్కులు తీసుకోవడం అన్నది ఊహకందని విషయం. ఇది ఇండియన్ సినిమాకే గర్వకారణం. ‘దృశ్యం’ ఎంతటి సార్వజనీనమైన కథ అనడానికి ఇది ఉదాహరణ. మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on February 29, 2024 3:29 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…