ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ.. దృశ్యం. ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్గా ఈ సినిమాను జీతు జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భారతీయ భాషల్లో ‘దృశ్యం’ను రీమేక్ చేశారు. బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు. ఇలా రీమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావడం ఆ కథ ప్రత్యేకత.
విశేషం ఏంటంటే.. ‘దృశ్యం’ విదేశీ భాషల్లోనూ రీమేక్ అయి సక్సెస్ సాధించింది. శ్రీలంక అధికార భాష అయిన సింహళీలో.. అలాగే చైనీస్, కొరియన్ భాషల్లోనూ ‘దృశ్యం’ను రీమేక్ చేయగా.. అక్కడా మంచి స్పందన వచ్చింది. ఇదే విశేషం అంటే.. ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్లబోతోంది దృశ్యం స్టోరీ.
హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించబోతోంది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. పనోరమ స్టూడియోస్ నుంచి వాళ్లు రీమేక్ హక్కులు తీసుకున్నారు.
హాలీవుడ్ నుంచి అధికారిక రీమేక్లకు తోడు బోలెడన్ని ఫ్రీమేక్లు మన స్క్రీన్ మీదికి వచ్చేస్తుంటాయి. కానీ మన కథ నచ్చి హాలీవుడ్లో రీమేక్ చేయడానికి అధికారికంగా హక్కులు తీసుకోవడం అన్నది ఊహకందని విషయం. ఇది ఇండియన్ సినిమాకే గర్వకారణం. ‘దృశ్యం’ ఎంతటి సార్వజనీనమైన కథ అనడానికి ఇది ఉదాహరణ. మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on February 29, 2024 3:29 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…