ఓటిటి, శాటిలైట్ రంగంలో పెను విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ డిస్నీ రిలయన్స్ చేతులు కలపడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆషామాషీ డీల్ కాదు. సుమారు 8.5 బిలియన్ డాలర్ల విలువకు ఈ ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ కలయిక ద్వారా దేశవ్యాప్తంగా 750 మిలియన్ల వ్యూయర్స్ ని చేరుకోబోతున్నారు. రిలయన్స్ కు 16.3, వయాకామ్ 46.3, డిస్నీ 36.8 శాతంతో వాటాలు కలిగి ఉంటాయి. నీతా అంబానీకి చైర్ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు. ఉదయ్ శంకర్ వైస్ చైర్ మెన్ తో పాటు స్ట్రాటజిక్ అడ్వైజర్ గా ఉంటారు.
రాబోయే రోజుల్లో 40 శాతానికి పైగా మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆరితేరిన రిలయన్స్ భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించవచ్చని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఓటిటిల పరంగా విపరీతమైన పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుండగా, ప్రైమ్ కొత్త ఎత్తుగడలతో సిద్ధమవుతోంది. సోనీ లివ్ లాంటివి ప్లాన్లు మారుస్తున్నాయి. ఆహా, ఈటీవీ విన్ తరహా ఓన్లీ తెలుగు యాప్స్ కు ఈ కాంపిటీషన్ ప్రణాళికలు మార్చుకునేలా చేస్తోంది.
థియేటర్ వినోదానికి సమాంతర ప్రత్యాన్మయంగా మారుతున్న ఓటిటిని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రేక్షకులను పెంచుకోవాలనేది రిలయన్స్, హాట్ స్టార్ ల సంయుక్త కార్యాచరణ. డిజిటల్ హక్కుల మార్కెట్ బాగా పడిపోయిందని దిగులు పడుతున్న నిర్మాతలకు ఇలాంటి పరిణామాలు సంతోషం కలిగించేవే. ఎందుకంటే పెద్ద స్టార్లవే కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాలకూ నిర్మాణంలో ఉండగానే డిమాండ్ పెరుగుతుంది. వెబ్ సిరీస్ ల ద్వారా ఆర్టిస్టులకు అవకాశాలు పెరుగుతాయి. డైరెక్ట్ డిజిటల్ మూవీస్ ప్రొడక్షన్ ఊపందుకుంటుంది.
This post was last modified on February 29, 2024 9:50 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…