టాలీవుడ్లో అక్కినేని, దగ్గుబాటి వారివి బడా ఫ్యామిలీలు. ఈ రెండు కుటుంబాలకు ఘనమైన సినీ వారసత్వం ఉంది. వాళ్లకు స్టూడియోలున్నాయి. అందులో 24 క్రాఫ్ట్స్లో అనుభవం, అవగాహన ఉన్న బోలెడంత మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లున్నారు. వివిధ సినీ పరిశ్రమలతో ఈ రెండు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి.
ఈ నేపథ్యంలో తమ వనరులను, అనుభవాన్ని సద్వినియోగం చేసేందుకు గాను ఈ రెండు ఫ్యామిలీస్ వేర్వేరుగా ఫిలిం స్కూల్స్ ఏర్పాటు చేశాయి. చాలా ఏళ్ల నుంచి సినిమాకు సంబంధించి అనేక కోర్సులు అందిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల్ని తీసుకొచ్చి శిక్షణార్థులకు క్లాసులు ఇప్పిస్తున్నాయి. తమ స్టూడియో వనరులనూ ఉపయోగించుకుంటున్నాయి. ఐతే జాతీయ స్థాయి ఈ రెండు ఫిలిం స్కూళ్లకూ మంచి పేరుంది. కానీ వీటి నుంచి ఆశించిన స్థాయిలో టెక్నీషియన్స్ బయటికి రావట్లేదు.
అక్కినేని వారి స్కూల్ నుంచి ఇంతకుముందు కొందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి సొంతంగా సినిమా తీసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఓ లేడీ డైరెక్టర్ తీసిన ‘పడేశావె’ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. అందరూ ఆ స్కూల్ స్టూడెంట్సే కలిసి తీసిన ఓ చిన్న సినిమా విడుదలకు కూడా నోచుకోకుండా ఆగిపోయింది. ఇంతకుమించి అన్నపూర్ణ వారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ల ఊసులేవీ ఇండస్ట్రీలో వినిపించలేదు.
ఇప్పుడు దగ్గుబాటి వారి కాంపౌండ్ నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు సురేష్ ప్రొడక్షన్స్లోనే దర్శకులుగా అవకాశాలు లభించాయి. అందులో ఒకరు సీనియర్ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు కొడుకు అశ్విన్ గంగరాజు. అతను ఇప్పటికే ‘ఆకాశవాణి’ అనే సినిమా తీశాడు. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే సురేష్ ప్రొడక్షన్స్లో ఓ మర్డర్ మిస్టరీ తీసే అవకాశం వచ్చింది. అతడితో పాటు సతీష్ త్రిపుర అనే మరో కొత్త దర్శకుడితోనూ సురేష్ బాబు ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ ఇద్దరు యువ దర్శకులు దగ్గుబాటి వారి పేరు నిలబెట్టే సినిమాలు తీస్తారేమో చూడాలి.
This post was last modified on September 10, 2020 2:48 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…