మాములుగా సినిమాలు చూసేందుకే స్టార్ హీరోలకు టైం ఉండదు. అలాంటిది వెబ్ సిరీస్ లంటే మహా కష్టం. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సెట్లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న మహేష్ బాబుకి సమయం దొరికినట్టు ఉంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన పోచర్ మీద లుక్కేశాడు. అక్కడితో ఆగలేదు. దాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఇన్స్ టా స్టోరీని పెట్టడంతో ఒక్కసారిగా అభిమానుల దృష్టి దాని మీదకు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కు సహ నిర్మాతగా ఇది మొదటి డిజిటల్ వెంచర్. అందుకే పోయిన గురువారం సెలబ్రిటీలకు ప్రీమియర్ వేశారు.
ఇది ఏనుగు దంతాలను దోచుకునే మాఫియా కథ. కేరళ రాష్ట్రం మలయత్తు ప్రాంతంలో ఉండే అడవి స్మగ్లింగ్ కి నెలవు. రేంజ్ ఆఫీసర్ గా పని చేసే మాల(నిమిష విజయన్)కు పద్దెనిమిది ఏనుగులు హత్యకు గురైన కేసుని అప్పగిస్తారు. డిపార్ట్ మెంట్ వ్యక్తే దొంగలకు సహకరించి అప్రూవర్ గా మారిపోతాడు. విచారణ చేసి హంతకులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన అలెన్(రోషన్ మాధ్యు) బృందంలో మాలకు చోటు దక్కుతుంది. మూలాలు తవ్వే కొద్దీ లింకులు ఎక్కడో ఢిల్లీ దాకా వెళ్తాయి. దీని వెనుక ఉన్నది మోరిస్, రాజ్ అని తెలుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న పోచర్ సుదీర్ఘంగా సాగుతుంది. సీరియస్ నేపథ్యంలో సాగే ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ లో తగినన్ని మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ అవసరమైన మోతాదులో దర్శకుడు రిచి మెహతా దట్టించినా డ్రామా పాలు ఎక్కువ కావడంతో కొంత ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యాక అవసరం లేని చోట ఫార్వార్డ్ కి పని చెప్పుకుంటూ పోతే పోచర్ ఓ మోస్తరుగా పర్వాలేదనే భావన వస్తుంది. ఎప్పుడూ సైకో మర్డర్ల చుట్టూ తిరిగే సిరీస్ ల మధ్య ఈ పోచర్ డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది. కాలక్షేపం కాక సమయం తగినంత ఉంటే పోచర్ ని ట్రై చేయొచ్చు.
This post was last modified on February 27, 2024 9:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…