పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ‘హరిహర వీరమల్లు’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. పవన్ స్టామినాను సరిగ్గా ఉపయోగించుకునేలా కనిపించింది ఈ చిత్రం. దీని కథాంశం, బడ్జెట్ అన్నీ కూడా ఒక రేంజిలో కనిపించాయి. ‘హరిహర వీరమల్లు’ టీజర్ చూసి అప్పట్లో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ భారీ చిత్రం రకరకాల కారణాల వల్ల విపరీతంగా ఆలస్యం అవుతోంది. అసలు ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజవుతుందో ఏమాత్రం క్లారిటీ లేదు.
ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. దాన్ని ఖండిస్తూ.. చిత్రీకరణ 80 శాతం పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయని.. త్వరలోనే అభిమానుల కోసం ఒక అప్డేట్ ఇవ్వబోతున్నామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా గురించి మాట్లాడారు. “పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే 20 రోజుల్లో ఏదో ఒక సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నేను ఆయనతో తీస్తున్న సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకున్నాను. ఆయనకు మంచి పేరు రావాలనుకున్నాను. అందుకే తొలిసారిగా ఆయనతో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. అభిమానులు ఇలాంటి ప్రచారాలను నమ్మకండి. ఈ సినిమాకు రెండో భాగం కూడా కచ్చితంగా ఉ:టుంది. ఈ సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తారు” అని రత్నం స్పష్టం చేశారు. మార్చి 8న శివరాత్రి కానుకగా ‘హరిహర వీరమల్లు’ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…