మాములుగా సినీ పరిశ్రమలో అబ్బాయిలను వారసులుగా సెటిల్ చేసేందుకు స్టార్ హీరోలు కష్టపడటం మాములే. స్వంతంగా సినిమాలు తీయడం ద్వారానో లేక పెద్ద బ్యానర్లు వచ్చేలా చేయడం వల్లనో ఏదో ఒక రూపంలో లెగసిని కొనసాగించేలా చూసుకుంటారు. కానీ కింగ్ షారుఖ్ ఖాన్ మాత్రం దానికి భిన్నంగా కూతురు సుహానాకి ఒక మంచి ఓపెనింగ్ ఇచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఇటీవలే ఈ అమ్మాయి నెట్ ఫ్లిక్స్ మూవీ ది ఆర్చీస్ తో డెబ్యూ చేసింది. లుక్స్, యాక్టింగ్ రెండూ ట్రోలింగ్ కు గురయ్యాయి. కంటెంట్ కూడా బాలేకపోవడంతో డిజిటల్ డిజాస్టర్ అయ్యింది.
కట్ చేస్తే సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. కింగ్ టైటిల్ తో రూపొందబోయే భారీ బడ్జెట్ చిత్రంలో షారుఖ్ ఎక్కువ నిడివి ఉండే ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. నిర్మాణం తన రెడ్ చిల్లీస్ బ్యానర్ మీదే జరగనుంది. దీనికి ఇద్దరు దర్శకత్వం వహిస్తారని ముంబై టాక్. ప్రధాన బాధ్యతలు సుజయ్ ఘోష్ నిర్వహిస్తే యాక్షన్ ఎపిసోడ్లను సిద్దార్థ్ ఆనంద్ పర్యవేక్షిస్తాడట. ప్రస్తుతం షారుఖ్ స్వంత ఇల్లు మన్నత్ లో వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. సుహానాకి శిక్షణ ఇచ్చేందుకు విదేశి నిపుణులను రప్పించారు. డంకీ తర్వాత షారుఖ్ ఖాళీగానే ఉన్నాడు.
ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఏడాది మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా స్కెచ్ వేశారట. ఆర్చీస్ లో దేని గురించి అయితే ఎక్కువ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో ప్రత్యేకంగా ఆ అంశాల మీద శ్రద్ధ పెడుతున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఎమోషన్స్ కు పెద్ద పీఠ ఉండేలా, షారుఖ్ సుహానాల మధ్య వచ్చే సన్నివేశాలు బెస్ట్ అనిపించేలా తీర్చిదిద్దుతారట. కొడుకు కన్నా ముందు కూతురి పట్ల ఇంత కేర్ తీసుకుంటున్న షారుఖ్ ని ఒక తండ్రిగా ఖచ్చితంగా అభినందించాల్సిందే.
This post was last modified on February 27, 2024 12:19 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…