మాములుగా సినీ పరిశ్రమలో అబ్బాయిలను వారసులుగా సెటిల్ చేసేందుకు స్టార్ హీరోలు కష్టపడటం మాములే. స్వంతంగా సినిమాలు తీయడం ద్వారానో లేక పెద్ద బ్యానర్లు వచ్చేలా చేయడం వల్లనో ఏదో ఒక రూపంలో లెగసిని కొనసాగించేలా చూసుకుంటారు. కానీ కింగ్ షారుఖ్ ఖాన్ మాత్రం దానికి భిన్నంగా కూతురు సుహానాకి ఒక మంచి ఓపెనింగ్ ఇచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఇటీవలే ఈ అమ్మాయి నెట్ ఫ్లిక్స్ మూవీ ది ఆర్చీస్ తో డెబ్యూ చేసింది. లుక్స్, యాక్టింగ్ రెండూ ట్రోలింగ్ కు గురయ్యాయి. కంటెంట్ కూడా బాలేకపోవడంతో డిజిటల్ డిజాస్టర్ అయ్యింది.
కట్ చేస్తే సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. కింగ్ టైటిల్ తో రూపొందబోయే భారీ బడ్జెట్ చిత్రంలో షారుఖ్ ఎక్కువ నిడివి ఉండే ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. నిర్మాణం తన రెడ్ చిల్లీస్ బ్యానర్ మీదే జరగనుంది. దీనికి ఇద్దరు దర్శకత్వం వహిస్తారని ముంబై టాక్. ప్రధాన బాధ్యతలు సుజయ్ ఘోష్ నిర్వహిస్తే యాక్షన్ ఎపిసోడ్లను సిద్దార్థ్ ఆనంద్ పర్యవేక్షిస్తాడట. ప్రస్తుతం షారుఖ్ స్వంత ఇల్లు మన్నత్ లో వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. సుహానాకి శిక్షణ ఇచ్చేందుకు విదేశి నిపుణులను రప్పించారు. డంకీ తర్వాత షారుఖ్ ఖాళీగానే ఉన్నాడు.
ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఏడాది మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా స్కెచ్ వేశారట. ఆర్చీస్ లో దేని గురించి అయితే ఎక్కువ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో ప్రత్యేకంగా ఆ అంశాల మీద శ్రద్ధ పెడుతున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఎమోషన్స్ కు పెద్ద పీఠ ఉండేలా, షారుఖ్ సుహానాల మధ్య వచ్చే సన్నివేశాలు బెస్ట్ అనిపించేలా తీర్చిదిద్దుతారట. కొడుకు కన్నా ముందు కూతురి పట్ల ఇంత కేర్ తీసుకుంటున్న షారుఖ్ ని ఒక తండ్రిగా ఖచ్చితంగా అభినందించాల్సిందే.
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…