ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే మరో మాట లేకుండా కల్కి పేరు చెప్పేయొచ్చు. ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఉన్న ఆకర్షణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్ హీరో అంటేనే కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారు. పైగా ఇది అతడి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా. పైగా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణానికి తోడు ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగతీ తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆ టైంకి రెడీ అవుతుందా అనే విషయంలో సందేహాలు ముసురుకున్నాయి.
కానీ వైజయంతీ మూవీస్ మాత్రం పక్కాగా మే 9కే సినిమాను రిలీజ్ చేస్తామని అంటోంది. ఇంకా ఈ మూవీ షూట్ పూర్తయినట్లు కూడా అప్డేట్ బయటికి రాలేదు. మరి భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమాను ఇంకో 70 రోజుల్లో రిలీజ్ చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
దీనికి తోడు కల్కికి సంబంధించి వస్తున్న తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఏకంగా 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయంగా అనేక లాంగ్వేజెస్లో కల్కిని డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. మరి అన్ని భాషల్లో రిలీజ్ అంటే డబ్బింగ్ అదీ చేయడానికే చాలా టైం పడుతుంది. ఈ సినిమా రేంజ్ దృష్ట్యా డబ్బింగ్ ఆషామాషీగా చేసినా కష్టమే. మరి అన్ని భాషల్లో పర్ఫెక్ట్గా సినిమాను సిద్ధం చేసి మే 9న రిలీజ్ చేయడం అంటే అసాధ్యమైన పనిలాగే అనిపిస్తోంది. మరి టీం కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి.
This post was last modified on February 26, 2024 6:14 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…