ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే మరో మాట లేకుండా కల్కి పేరు చెప్పేయొచ్చు. ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఉన్న ఆకర్షణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్ హీరో అంటేనే కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారు. పైగా ఇది అతడి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా. పైగా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణానికి తోడు ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగతీ తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆ టైంకి రెడీ అవుతుందా అనే విషయంలో సందేహాలు ముసురుకున్నాయి.
కానీ వైజయంతీ మూవీస్ మాత్రం పక్కాగా మే 9కే సినిమాను రిలీజ్ చేస్తామని అంటోంది. ఇంకా ఈ మూవీ షూట్ పూర్తయినట్లు కూడా అప్డేట్ బయటికి రాలేదు. మరి భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమాను ఇంకో 70 రోజుల్లో రిలీజ్ చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
దీనికి తోడు కల్కికి సంబంధించి వస్తున్న తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఏకంగా 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయంగా అనేక లాంగ్వేజెస్లో కల్కిని డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. మరి అన్ని భాషల్లో రిలీజ్ అంటే డబ్బింగ్ అదీ చేయడానికే చాలా టైం పడుతుంది. ఈ సినిమా రేంజ్ దృష్ట్యా డబ్బింగ్ ఆషామాషీగా చేసినా కష్టమే. మరి అన్ని భాషల్లో పర్ఫెక్ట్గా సినిమాను సిద్ధం చేసి మే 9న రిలీజ్ చేయడం అంటే అసాధ్యమైన పనిలాగే అనిపిస్తోంది. మరి టీం కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి.
This post was last modified on February 26, 2024 6:14 am
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…