గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమెడియన్ వేణు యెల్దండి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు. న్యాచురల్ నానికి చెప్పిన కథ ఓకే అయ్యిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా శిరీష్, హర్షిత్ తో కలిసి వేణు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమైపోయింది. మాములుగా అయితే వీళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షలు, కార్పణ్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట. దసరా కూడా ఇలాంటి నేపధ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్టు వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఫైనల్ వెర్షన్ ఓకే కాగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు.
తర్వాత లిస్టులో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అదంతా వట్టి పుకారే. సో మిగిలిన ఇద్దరిలో ఎవరిది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజికి ఎన్నికలు అయ్యాక కాల్ షీట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ మరీ లేట్ అవుతుందనుకుంటే హరీష్ శంకర్ లాగా ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు. కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజికి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌట్ లేదు. ఇక శ్రీకాంత్ ఓదెల స్టోరీ రెడీ కాగానే నానిని కలిసే ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఎవరు ముందుంటారో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…