గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమెడియన్ వేణు యెల్దండి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు. న్యాచురల్ నానికి చెప్పిన కథ ఓకే అయ్యిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా శిరీష్, హర్షిత్ తో కలిసి వేణు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమైపోయింది. మాములుగా అయితే వీళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షలు, కార్పణ్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట. దసరా కూడా ఇలాంటి నేపధ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్టు వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఫైనల్ వెర్షన్ ఓకే కాగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు.
తర్వాత లిస్టులో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అదంతా వట్టి పుకారే. సో మిగిలిన ఇద్దరిలో ఎవరిది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజికి ఎన్నికలు అయ్యాక కాల్ షీట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ మరీ లేట్ అవుతుందనుకుంటే హరీష్ శంకర్ లాగా ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు. కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజికి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌట్ లేదు. ఇక శ్రీకాంత్ ఓదెల స్టోరీ రెడీ కాగానే నానిని కలిసే ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఎవరు ముందుంటారో.
This post was last modified on February 24, 2024 7:11 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…