గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమెడియన్ వేణు యెల్దండి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు. న్యాచురల్ నానికి చెప్పిన కథ ఓకే అయ్యిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా శిరీష్, హర్షిత్ తో కలిసి వేణు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమైపోయింది. మాములుగా అయితే వీళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షలు, కార్పణ్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట. దసరా కూడా ఇలాంటి నేపధ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్టు వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఫైనల్ వెర్షన్ ఓకే కాగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు.
తర్వాత లిస్టులో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అదంతా వట్టి పుకారే. సో మిగిలిన ఇద్దరిలో ఎవరిది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజికి ఎన్నికలు అయ్యాక కాల్ షీట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ మరీ లేట్ అవుతుందనుకుంటే హరీష్ శంకర్ లాగా ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు. కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజికి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌట్ లేదు. ఇక శ్రీకాంత్ ఓదెల స్టోరీ రెడీ కాగానే నానిని కలిసే ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఎవరు ముందుంటారో.
This post was last modified on February 24, 2024 7:11 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…