గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమెడియన్ వేణు యెల్దండి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు. న్యాచురల్ నానికి చెప్పిన కథ ఓకే అయ్యిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా శిరీష్, హర్షిత్ తో కలిసి వేణు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమైపోయింది. మాములుగా అయితే వీళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షలు, కార్పణ్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట. దసరా కూడా ఇలాంటి నేపధ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్టు వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఫైనల్ వెర్షన్ ఓకే కాగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు.
తర్వాత లిస్టులో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అదంతా వట్టి పుకారే. సో మిగిలిన ఇద్దరిలో ఎవరిది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజికి ఎన్నికలు అయ్యాక కాల్ షీట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ మరీ లేట్ అవుతుందనుకుంటే హరీష్ శంకర్ లాగా ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు. కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజికి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌట్ లేదు. ఇక శ్రీకాంత్ ఓదెల స్టోరీ రెడీ కాగానే నానిని కలిసే ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఎవరు ముందుంటారో.
This post was last modified on February 24, 2024 7:11 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…