భీష్మ సినిమాతో తన ఫ్లాపుల హ్యాట్రిక్ని మరపించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ప్రేమతో రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే గిఫ్ట్ గా కేవలం ఖరీదయిన కారే కాదు… మరో కోటి రూపాయల చెక్కు కూడా ఇచ్చాడని ఇన్సైడ్ టాకు. డబ్బులెందుకు ఇచ్చాడా అనుకుంటున్నారా? కార్ కీ ఇవ్వడంతో పాటు కుడుములని ఒక ప్రాజెక్ట్ కోసం నితిన్ లాక్ చేసేసాడట. ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తాడట.
కానీ ఈ సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. నితిన్కి రంగ్దే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో వున్నాయి. అలాగే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. వెంకీ కుడుముల సినిమా కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే పనిలో మైత్రి మూవీస్ బిజీగా వుంది. మైత్రి తరఫున ఇంతకుముందే చరణ్ను, ఆ తర్వాత మహేష్ను కలిసి కుడుముల లైన్ వినిపించాడనే ప్రచారం జరిగింది. ఎంత పెద్ద స్టార్తో చేసినా కానీ కుడుముల మళ్లీ నితిన్తో అయితే సినిమా చేసి తీరాలన్నమాట. భీష్ముడు భలేగా లాక్ చేసాడు కదూ!
This post was last modified on September 9, 2020 10:30 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…