భీష్మ సినిమాతో తన ఫ్లాపుల హ్యాట్రిక్ని మరపించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ప్రేమతో రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే గిఫ్ట్ గా కేవలం ఖరీదయిన కారే కాదు… మరో కోటి రూపాయల చెక్కు కూడా ఇచ్చాడని ఇన్సైడ్ టాకు. డబ్బులెందుకు ఇచ్చాడా అనుకుంటున్నారా? కార్ కీ ఇవ్వడంతో పాటు కుడుములని ఒక ప్రాజెక్ట్ కోసం నితిన్ లాక్ చేసేసాడట. ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తాడట.
కానీ ఈ సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. నితిన్కి రంగ్దే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో వున్నాయి. అలాగే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. వెంకీ కుడుముల సినిమా కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే పనిలో మైత్రి మూవీస్ బిజీగా వుంది. మైత్రి తరఫున ఇంతకుముందే చరణ్ను, ఆ తర్వాత మహేష్ను కలిసి కుడుముల లైన్ వినిపించాడనే ప్రచారం జరిగింది. ఎంత పెద్ద స్టార్తో చేసినా కానీ కుడుముల మళ్లీ నితిన్తో అయితే సినిమా చేసి తీరాలన్నమాట. భీష్ముడు భలేగా లాక్ చేసాడు కదూ!
This post was last modified on September 9, 2020 10:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…