భీష్మ సినిమాతో తన ఫ్లాపుల హ్యాట్రిక్ని మరపించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ప్రేమతో రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే గిఫ్ట్ గా కేవలం ఖరీదయిన కారే కాదు… మరో కోటి రూపాయల చెక్కు కూడా ఇచ్చాడని ఇన్సైడ్ టాకు. డబ్బులెందుకు ఇచ్చాడా అనుకుంటున్నారా? కార్ కీ ఇవ్వడంతో పాటు కుడుములని ఒక ప్రాజెక్ట్ కోసం నితిన్ లాక్ చేసేసాడట. ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తాడట.
కానీ ఈ సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. నితిన్కి రంగ్దే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో వున్నాయి. అలాగే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. వెంకీ కుడుముల సినిమా కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే పనిలో మైత్రి మూవీస్ బిజీగా వుంది. మైత్రి తరఫున ఇంతకుముందే చరణ్ను, ఆ తర్వాత మహేష్ను కలిసి కుడుముల లైన్ వినిపించాడనే ప్రచారం జరిగింది. ఎంత పెద్ద స్టార్తో చేసినా కానీ కుడుముల మళ్లీ నితిన్తో అయితే సినిమా చేసి తీరాలన్నమాట. భీష్ముడు భలేగా లాక్ చేసాడు కదూ!
This post was last modified on September 9, 2020 10:30 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…