భీష్మ సినిమాతో తన ఫ్లాపుల హ్యాట్రిక్ని మరపించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ప్రేమతో రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే గిఫ్ట్ గా కేవలం ఖరీదయిన కారే కాదు… మరో కోటి రూపాయల చెక్కు కూడా ఇచ్చాడని ఇన్సైడ్ టాకు. డబ్బులెందుకు ఇచ్చాడా అనుకుంటున్నారా? కార్ కీ ఇవ్వడంతో పాటు కుడుములని ఒక ప్రాజెక్ట్ కోసం నితిన్ లాక్ చేసేసాడట. ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తాడట.
కానీ ఈ సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. నితిన్కి రంగ్దే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో వున్నాయి. అలాగే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. వెంకీ కుడుముల సినిమా కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే పనిలో మైత్రి మూవీస్ బిజీగా వుంది. మైత్రి తరఫున ఇంతకుముందే చరణ్ను, ఆ తర్వాత మహేష్ను కలిసి కుడుముల లైన్ వినిపించాడనే ప్రచారం జరిగింది. ఎంత పెద్ద స్టార్తో చేసినా కానీ కుడుముల మళ్లీ నితిన్తో అయితే సినిమా చేసి తీరాలన్నమాట. భీష్ముడు భలేగా లాక్ చేసాడు కదూ!
This post was last modified on September 9, 2020 10:30 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…