Movie News

ఆడవారి మాటలకు జోడి మళ్ళీ ఇంకోసారి

విక్టరీ వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007లో రిలీజైన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన తీరు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్టు అందుకునేలా చేసింది. వెంకీ త్రిష జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీలవ్వడమే కాక పాటల్లో బాగా ఎంజాయ్ చేశారు. తిరిగి 20009లో నమో వెంకటేశా చేశారు కానీ అది ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. 2012లో బాడీ గార్డ్ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది

కట్ చేస్తే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసే అవకాశమున్నట్టు ఫిలిం నగర్ టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషనే తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. కాకపోతే ఆమె డేట్స్ దొరకడం అంత సులభంగా లేదట. ఆల్రెడీ చిరంజీవి విశ్వంభరకు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది. ఇంకోవైపు కమల్ హాసన్ తగ్స్ లైఫ్, అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది. మోహన్ లాల్ రామ్, టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి. వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట. సో వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది.

ఒకవేళ ఓకే అయితే వెంకటేష్ అనిల్ రావిపూడిలకు పెద్ద సమస్య తీరినట్టే. ఎందుకంటే ఈ మధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్ల సెట్ చేయడం దర్శకులకు సవాల్ గా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్, లియోలో త్రిషని చూశాక అరే ఇన్నేళ్లు ఎలా మిస్ అయ్యామని ఫీలైన వాళ్లే ఎక్కువ. అందుకే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే మన్సూర్ అలీ ఖాన్ తో పాటు ఒక రాజకీయ పార్టీ నేత చేసిన అనవసర వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన త్రిష ఈసారి మౌనంగా ఉండకుండా సదరు పొలిటికల్ లీడర్ మీద పరువు నష్టం దావా వేసి ఆ నోటీస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్నింగ్ ఇచ్చింది.

This post was last modified on February 22, 2024 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

15 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago