విక్టరీ వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007లో రిలీజైన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన తీరు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్టు అందుకునేలా చేసింది. వెంకీ త్రిష జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీలవ్వడమే కాక పాటల్లో బాగా ఎంజాయ్ చేశారు. తిరిగి 20009లో నమో వెంకటేశా చేశారు కానీ అది ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. 2012లో బాడీ గార్డ్ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది
కట్ చేస్తే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసే అవకాశమున్నట్టు ఫిలిం నగర్ టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషనే తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. కాకపోతే ఆమె డేట్స్ దొరకడం అంత సులభంగా లేదట. ఆల్రెడీ చిరంజీవి విశ్వంభరకు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది. ఇంకోవైపు కమల్ హాసన్ తగ్స్ లైఫ్, అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది. మోహన్ లాల్ రామ్, టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి. వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట. సో వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది.
ఒకవేళ ఓకే అయితే వెంకటేష్ అనిల్ రావిపూడిలకు పెద్ద సమస్య తీరినట్టే. ఎందుకంటే ఈ మధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్ల సెట్ చేయడం దర్శకులకు సవాల్ గా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్, లియోలో త్రిషని చూశాక అరే ఇన్నేళ్లు ఎలా మిస్ అయ్యామని ఫీలైన వాళ్లే ఎక్కువ. అందుకే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే మన్సూర్ అలీ ఖాన్ తో పాటు ఒక రాజకీయ పార్టీ నేత చేసిన అనవసర వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన త్రిష ఈసారి మౌనంగా ఉండకుండా సదరు పొలిటికల్ లీడర్ మీద పరువు నష్టం దావా వేసి ఆ నోటీస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్నింగ్ ఇచ్చింది.
This post was last modified on February 22, 2024 9:46 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…