Movie News

అఖిల్‍కి రామ్‍ చరణ్‍ సెట్‍ చేసాడా?

అఖిల్‍తో సురేందర్‍ రెడ్డి ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అవడంతో అక్కినేని అభిమానులు ఆనందిస్తున్నారు. ఇన్నాళ్లకు అఖిల్‍కు ఒక మంచి ప్రాజెక్ట్ కుదిరిందని, సురేందర్‍ లాంటి కమర్షియల్‍ డైరెక్టర్‍ చేతిలో అఖిల్‍ స్టార్‍ అవుతాడని ఫాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమయిన వార్త ప్రచారంలో వుంది. ఈ ప్రాజెక్ట్ అఖిల్‍కి సెట్‍ అవడంలో రామ్‍ చరణ్‍ కీలక పాత్ర పోషించాడని దాని సారాంశం.

సురేందర్‍కి మంచి స్నేహితుడైన చరణ్‍ అతడికి అఖిల్‍తో ఒక సినిమా చేయాలని చెప్పాడట. అఖిల్‍ని సొంత తమ్ముడిలా భావించే చరణ్‍ అతని కెరియర్‍ పట్ల చాలా ఆసక్తి కనబరుస్తుంటాడనేది తెలిసిందే. సురేందర్‍ లాంటి స్టార్‍ డైరెక్టర్‍తో చేస్తే అఖిల్‍ ట్రాక్‍ మీదకు వచ్చేస్తాడని చరణ్‍ అతడిని స్వయంగా కోరినట్టు సమాచారం. అలాగే ఏకే ఎంటర్‍టైన్‍మెంట్స్ ఈ ప్రాజెక్ట్ టేకప్‍ చేయడంలోను చరణ్‍ పాత్ర వుందని అంటున్నారు.

చిరంజీవితో ఏకే ఎంటర్‍టైన్‍మెంట్స్ త్వరలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీని గురించి చరణ్‍, అఖిల్‍, సురేందర్‍, అనిల్‍ ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈ వార్తలో నిజముంటే కనుక అక్కినేని ఫాన్స్ కి చరణ్‍ పట్ల సాఫ్ట్ కార్నర్‍ ఏర్పడే ఛాన్స్ వుంది.

This post was last modified on September 9, 2020 10:19 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

2 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

4 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

5 hours ago

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…

5 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

6 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

7 hours ago