తెలుగులో ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు బెల్లంకొండ శ్రీనివాస్. తండ్రి బెల్లంకొండ సురేష్ అండతో పెద్ద పెద్ద బడ్జెట్లలో, పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు కెరీర్ ఆరంభంలో. కానీ ఈ మధ్య అతడి జోరు బాగా తగ్గిపోయింది. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం కొన్నేళ్లు కష్టపడితే అది కనీస ప్రభావం కూడా చూపలేదు.
ఇప్పుడతను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పనిలో శ్రీనివాస్ బిజీగా ఉండగా.. అతడి పాత సినిమా ఒకటి సంచలన రికార్డును సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆ చిత్రం మరేదో కాదు.. జయ జానకి నాయక. దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం.
గత కొన్నేళ్లలో అనేక తెలుగు చిత్రాలను హిందీలో అనువాదం చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. గోల్డ్ మైన్ ఫిలిమ్స్, పెన్ మూవీస్ లాంటి సంస్థలకు ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. తెలుగులో ఫలితంతో సంబంధం లేకుండా అనువాద చిత్రాలు యూట్యూబ్లో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన మాస్ సినిమాలన్నీ అక్కడ భారీగా వ్యూస్ తెచ్చుకున్నాయి.
‘జయ జానకి నాయక’ అయితే ఏకంగా 800 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించడం విశేషం. ఇండియానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమాకూ యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ రాలేదట. ఇది వరల్డ్ రికార్డ్ అంటూ పెన్ మూవీస్ ట్విట్టర్లో ప్రకటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ 2017లో విడుదలై ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. అలాంటి సినిమాకు హిందీలో ఈ స్థాయిలో వ్యూస్ రావడం అనూహ్యం.
This post was last modified on February 21, 2024 5:00 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…