ప్రభాస్, దర్శకుడు నాగ అశ్విన్ కలయికలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9 విడుదలని టీమ్ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది కానీ చేతిలో ఎనభై రోజుల వ్యవధిలో వర్క్ మొత్తం ఫినిష్ చేయగలరా లేదానే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. వైజయంతి మూవీస్ అదే డేట్ కి రావాలని సెంటిమెంట్ గా ఫీలవుతోంది. తమ బ్యానర్ లోని ఐకానిక్ మూవీస్ మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ రోజు వచ్చే బ్లాక్ బస్టర్లయ్యాయి. పైగా ఇది ఆ సంస్థకు యాభై వార్షికోత్సవం. ఇలా అన్ని లెక్కేసుకునే మే 9 లాక్ చేసుకున్నారు.
తీరా చూస్తే మళ్ళీ వాయిదా ఊహాగానాలు మొదలైపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇది వస్తుందని తెలిసే మే 9 ఎవరూ షెడ్యూల్ చేసుకోలేదు. బాలీవుడ్ లోనూ రిస్క్ ఎందుకు లెమ్మని ఈ తేదీకి దూరంగా ఉన్నారు. సలార్ ని ఢీ కొని షారుఖ్ ఖాన్ అంతటివాడే దెబ్బ తిన్నాక ఎవరు మాత్రం ఎందుకు సాహసం చేస్తారు. కానీ ఇప్పుడు కల్కి కనక తప్పుకుంటే ఇతర ప్రొడ్యూసర్లు టెన్షన్ పడటం ఖాయం. ఎందుకంటే గతంలో సలార్ టైంలోనూ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు మార్చినప్పుడు వేరే నిర్మాతలు బాగా నష్టపోయారు. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు.
ఇప్పుడు కల్కి అదే బాట పడితే మాత్రం మరోసారి తలనెప్పులు ఖాయం. టీమ్ మాత్రం అబ్బే అదేం లేదు మే 9 ఎలాంటి మార్పు లేదని అఫ్ ది రికార్డు చెబుతోంది. ఇతర దర్శకుల్లా ఏదైనా అడుగుదామంటే నాగ అశ్విన్ బయట అంత సులభంగా దొరకడం లేదు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ విఎఫెక్స్ పనుల్లో ఇంకా బెస్ట్ క్వాలిటీని అతను డిమాండ్ చేయడంతో మళ్ళీ మళ్ళీ వర్క్ జరుగుతోందని వినిపిస్తోంది. సో వీలైనంత త్వరగా కీలక ప్రకటన ఇస్తే బాగుంటుంది. రాజమౌళి తరహాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లారిటీ ఇచ్చేస్తే ఏ గోలా ఉండదు. లేదూ సలార్ లాగా అన్నీ చెప్పకుండా చేస్తాం అంటే ఎవరైనా ఏం చేయగలరు.
This post was last modified on February 21, 2024 4:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…