ప్రభాస్, దర్శకుడు నాగ అశ్విన్ కలయికలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9 విడుదలని టీమ్ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది కానీ చేతిలో ఎనభై రోజుల వ్యవధిలో వర్క్ మొత్తం ఫినిష్ చేయగలరా లేదానే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. వైజయంతి మూవీస్ అదే డేట్ కి రావాలని సెంటిమెంట్ గా ఫీలవుతోంది. తమ బ్యానర్ లోని ఐకానిక్ మూవీస్ మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ రోజు వచ్చే బ్లాక్ బస్టర్లయ్యాయి. పైగా ఇది ఆ సంస్థకు యాభై వార్షికోత్సవం. ఇలా అన్ని లెక్కేసుకునే మే 9 లాక్ చేసుకున్నారు.
తీరా చూస్తే మళ్ళీ వాయిదా ఊహాగానాలు మొదలైపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇది వస్తుందని తెలిసే మే 9 ఎవరూ షెడ్యూల్ చేసుకోలేదు. బాలీవుడ్ లోనూ రిస్క్ ఎందుకు లెమ్మని ఈ తేదీకి దూరంగా ఉన్నారు. సలార్ ని ఢీ కొని షారుఖ్ ఖాన్ అంతటివాడే దెబ్బ తిన్నాక ఎవరు మాత్రం ఎందుకు సాహసం చేస్తారు. కానీ ఇప్పుడు కల్కి కనక తప్పుకుంటే ఇతర ప్రొడ్యూసర్లు టెన్షన్ పడటం ఖాయం. ఎందుకంటే గతంలో సలార్ టైంలోనూ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు మార్చినప్పుడు వేరే నిర్మాతలు బాగా నష్టపోయారు. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు.
ఇప్పుడు కల్కి అదే బాట పడితే మాత్రం మరోసారి తలనెప్పులు ఖాయం. టీమ్ మాత్రం అబ్బే అదేం లేదు మే 9 ఎలాంటి మార్పు లేదని అఫ్ ది రికార్డు చెబుతోంది. ఇతర దర్శకుల్లా ఏదైనా అడుగుదామంటే నాగ అశ్విన్ బయట అంత సులభంగా దొరకడం లేదు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ విఎఫెక్స్ పనుల్లో ఇంకా బెస్ట్ క్వాలిటీని అతను డిమాండ్ చేయడంతో మళ్ళీ మళ్ళీ వర్క్ జరుగుతోందని వినిపిస్తోంది. సో వీలైనంత త్వరగా కీలక ప్రకటన ఇస్తే బాగుంటుంది. రాజమౌళి తరహాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లారిటీ ఇచ్చేస్తే ఏ గోలా ఉండదు. లేదూ సలార్ లాగా అన్నీ చెప్పకుండా చేస్తాం అంటే ఎవరైనా ఏం చేయగలరు.
This post was last modified on February 21, 2024 4:51 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…