ఈ రోజుల్లో సినిమా ఒరిజినల్ రిజల్ట్ ఏంటో తెలియాలంటే వీకెండ్ అయ్యేవరకు ఎదురు చూడాలి. ముందస్తు హైప్ ఉన్న సినిమాలు వీకెండ్ వరకు బాగానే పెర్ఫామ్ చేస్తాయి. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకుంటే వీకెండ్ అవ్వగానే వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయిపోతాయి. ఫిబ్రవరిలో సినిమాలన్నింటి పరిస్థితి ఇలాగే ఉంది.
తొలి వారంలో వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, రెండో వారంలో రిలీజైన ఈగల్ సినిమాలు వీకెండ్ వరకు బాగానే పెర్ఫామ్ చేశాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ‘ఈగల్’ పరిస్థితి అయితే వారం తిరిగేసరికి చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇక గత వీకెండ్లో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ డివైడ్ టాక్ తట్టుకుని తొలి వీకెండ్లో బాగానే పెర్ఫామ్ చేసింది.
కానీ సోమవారం ‘భైరవకోన’ కలెక్షన్లలో బాగా డ్రాప్ కనిపించింది. వీక్ డేస్లో మార్నింగ్ షోలు, మ్యాట్నీలకు థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈవెనింగ్, నైట్ షోలకు కూడా వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కలెక్షన్లు పెద్దగా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. మిడ్ వీక్కు వచ్చేసరికి అసలు సౌండ్ లేదు. ఈ సినిమా గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా హడావుడి బాగా తగ్గిపోయింది.
ప్రేక్షకుల ఫోకస్ కొత్త సినిమాల మీదికి మళ్లుతోంది. అలా అని ఈ వారం పేరున్న సినిమాలేవీ రావట్లేదు. అన్నీ చిన్న స్థాయివే. సిద్దార్థ రాయ్, సుందరం మాస్టార్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్లకు తోడు భ్రమయుగం అనే డబ్బింగ్ మూవీ బాక్సాఫీస్ దండయాత్రకు వస్తున్నాయి. మరి వీటి ప్రభావాన్ని తట్టుకుని ‘ఊరు పేరు భైరవకోన’ వీకెండ్లో ఏమాత్రం సత్తా చాటుతుందో చూడాలి.
This post was last modified on February 21, 2024 4:48 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…