Movie News

బొమ్మరిల్లు జెనీలియా జంటది భలే తెలివి

ఇప్పుడు కనిపించడం మానేసింది కానీ బొమ్మరిల్లు టైంలో హీరోయిన్ జెనీలియాకు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బక్కపలచని దేహంతో ఉన్నా చలాకీతనం, ఆకట్టుకునే కళ్ళు, గలగలా మాట్లాడే నోరు తక్కువ టైంలో ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టాయి. దెబ్బకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన జోడి కట్టేందుకు వెంటనే ఆఫర్లు వచ్చాయి. వాటిలో అధిక శాతం ఆశించిన విజయాలు సాధించకపోవడంతో క్రమంగా తెరమరుగై బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్ ని పెట్టుకుని హ్యాపీగా ముంబైకి మకాం మార్చేసింది.

కథ ఇక్కడితో అయిపోలేదు. మాములుగా గృహిణిగా మారాక ఆర్టిస్టులు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోతారు. పైగా రితీష్ కూడా డిమాండ్ తగ్గిపోయిన హీరో. సహజంగానే ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. కానీ ఈ జంట అలా ఆలోచించలేదు. నాగచైతన్య సమంత మజిలీ రీమేక్ రైట్స్ కొనుక్కుని రెండు సంవత్సరాల క్రితం మరాఠిలో వేద్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. రితీష్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా తొలి దర్శకత్వం కూడా చేశాడు. వంద కోట్ల వసూళ్లు దాటేశాయి. కట్ చేస్తే ఇప్పుడు అతని డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో రాజా శివాజీని తెరకెక్కిస్తున్నారు.

నిన్న అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. చూస్తుంటే భార్యాభర్తల తెలివైన ప్లానింగ్ కి సూపర్ అనకుండా ఉండలేం. కెరీర్ లో తనకో గుర్తింపునిచ్చిన టాలీవుడ్ నుంచే తన భర్త డెబ్యూకి కావాల్సిన సినిమాను వెతుక్కోవడం దగ్గరే జెనీలియా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. మజిలీని హిందీలోనే తీయొచ్చు. అలాంటివి అక్కడ చాలా వచ్చాయి. కానీ మరాఠిని ఎంచుకోవడం ద్వారా అద్భుత ఫలితం దక్కింది. మహారాష్ట్రలో శివాజీకున్న ఆరాధనాభావం గురించి అందరికీ తెలిసిందే. ఏకంగా జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమంటే మాటలా.

This post was last modified on February 20, 2024 4:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

3 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

4 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

4 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 hours ago