ఇప్పుడు కనిపించడం మానేసింది కానీ బొమ్మరిల్లు టైంలో హీరోయిన్ జెనీలియాకు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బక్కపలచని దేహంతో ఉన్నా చలాకీతనం, ఆకట్టుకునే కళ్ళు, గలగలా మాట్లాడే నోరు తక్కువ టైంలో ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టాయి. దెబ్బకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన జోడి కట్టేందుకు వెంటనే ఆఫర్లు వచ్చాయి. వాటిలో అధిక శాతం ఆశించిన విజయాలు సాధించకపోవడంతో క్రమంగా తెరమరుగై బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్ ని పెట్టుకుని హ్యాపీగా ముంబైకి మకాం మార్చేసింది.
కథ ఇక్కడితో అయిపోలేదు. మాములుగా గృహిణిగా మారాక ఆర్టిస్టులు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోతారు. పైగా రితీష్ కూడా డిమాండ్ తగ్గిపోయిన హీరో. సహజంగానే ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. కానీ ఈ జంట అలా ఆలోచించలేదు. నాగచైతన్య సమంత మజిలీ రీమేక్ రైట్స్ కొనుక్కుని రెండు సంవత్సరాల క్రితం మరాఠిలో వేద్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. రితీష్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా తొలి దర్శకత్వం కూడా చేశాడు. వంద కోట్ల వసూళ్లు దాటేశాయి. కట్ చేస్తే ఇప్పుడు అతని డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో రాజా శివాజీని తెరకెక్కిస్తున్నారు.
నిన్న అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. చూస్తుంటే భార్యాభర్తల తెలివైన ప్లానింగ్ కి సూపర్ అనకుండా ఉండలేం. కెరీర్ లో తనకో గుర్తింపునిచ్చిన టాలీవుడ్ నుంచే తన భర్త డెబ్యూకి కావాల్సిన సినిమాను వెతుక్కోవడం దగ్గరే జెనీలియా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. మజిలీని హిందీలోనే తీయొచ్చు. అలాంటివి అక్కడ చాలా వచ్చాయి. కానీ మరాఠిని ఎంచుకోవడం ద్వారా అద్భుత ఫలితం దక్కింది. మహారాష్ట్రలో శివాజీకున్న ఆరాధనాభావం గురించి అందరికీ తెలిసిందే. ఏకంగా జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమంటే మాటలా.
This post was last modified on February 20, 2024 4:27 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…