Movie News

ఏప్రిల్ సినిమాలకు ఎన్నికల సెగలు

ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఈసారి ఏపీ ఎలక్షన్లు వాడివేడిగా ఉండబోతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్షం టీడీపీ-జనసేనల పొత్తు పరస్పరం ఎలా తలపడతాయనే దాని మీద సామాన్య జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మీడియా టాక్ ప్రకారం నామినేషన్లు మార్చి 28 నుంచి ప్రారంభమవుతాయి. పోలింగ్ ఏప్రిల్ 19 జరిగే అవకాశముంది. 25 ఫలితాలు ప్రకటించి అదే నెల 30 కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా షెడ్యూల్ చేస్తారని తెలిసింది. అధికారికంగా వచ్చేదాకా దీన్ని ఖరారు చేయలేం వార్త విశ్వసనీయమే.

దీనికి సినిమాలకు సంబంధం లేకపోలేదు. ఒకపక్క ప్రచారాల హోరులో తడిసిపోతున్న జనాలు అంత సులభంగా థియేటర్లకు రారు. పెద్ద స్టార్ హీరోలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదురీది ఆడియన్స్ ని రప్పించగలరు. ఏప్రిల్ లో చెప్పుకోదగ్గ వాటిలో 5న వచ్చే విజయ్ దేవరకొండా ఫ్యామిలీ మ్యాన్ ప్రధానమైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఓ రెండు వారాలు గట్టిగా ఆడినా చాలు నిర్మాత దిల్ రాజుకు మొత్తం రికవర్ అయిపోతుంది. దేవర ఎలాగూ తప్పుకుంది కాబట్టి ఇబ్బంది లేదు. గ్యాంగ్స్ అఫ్ గోదావరిని ఏప్రిల్ 19 రిలీజ్ గురించి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ ఎన్నికల గోలలో ఎందుకనుకుంటే మేకి షిఫ్ట్ చేయొచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ప్యాన్ ఇండియా సినిమాలేవీ ఏప్రిల్ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణ ఎలక్షన్ల సమయంలో వాతావరణం ఇంత వేడిగా లేదు. కానీ ఏపీలో దానికి పూర్తి రివర్స్ లో ఉంది. పొలిటికల్ వార్ కంటే ఎంటర్ టైన్మెంట్ ఏముంటుందనే రీతిలో పబ్లిక్ కి కావాల్సిన కాలక్షేపం దొరికేలా ఉంది. విశాల్ రత్నం, విక్రమ్ తంగలాన్ లు ఆ నెలలో రావాలని చూస్తున్నాయి కానీ డేట్లు కొంచెం అటుఇటు కావొచ్చు. ఎలా చూసుకున్నా టాలీవుడ్ కు ఎన్నికల సెగ అంత సీరియస్ గా ఉండదనేద వాస్తవం.

This post was last modified on February 19, 2024 5:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

39 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago