ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఈసారి ఏపీ ఎలక్షన్లు వాడివేడిగా ఉండబోతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్షం టీడీపీ-జనసేనల పొత్తు పరస్పరం ఎలా తలపడతాయనే దాని మీద సామాన్య జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మీడియా టాక్ ప్రకారం నామినేషన్లు మార్చి 28 నుంచి ప్రారంభమవుతాయి. పోలింగ్ ఏప్రిల్ 19 జరిగే అవకాశముంది. 25 ఫలితాలు ప్రకటించి అదే నెల 30 కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా షెడ్యూల్ చేస్తారని తెలిసింది. అధికారికంగా వచ్చేదాకా దీన్ని ఖరారు చేయలేం వార్త విశ్వసనీయమే.
దీనికి సినిమాలకు సంబంధం లేకపోలేదు. ఒకపక్క ప్రచారాల హోరులో తడిసిపోతున్న జనాలు అంత సులభంగా థియేటర్లకు రారు. పెద్ద స్టార్ హీరోలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదురీది ఆడియన్స్ ని రప్పించగలరు. ఏప్రిల్ లో చెప్పుకోదగ్గ వాటిలో 5న వచ్చే విజయ్ దేవరకొండా ఫ్యామిలీ మ్యాన్ ప్రధానమైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఓ రెండు వారాలు గట్టిగా ఆడినా చాలు నిర్మాత దిల్ రాజుకు మొత్తం రికవర్ అయిపోతుంది. దేవర ఎలాగూ తప్పుకుంది కాబట్టి ఇబ్బంది లేదు. గ్యాంగ్స్ అఫ్ గోదావరిని ఏప్రిల్ 19 రిలీజ్ గురించి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
ఒకవేళ ఎన్నికల గోలలో ఎందుకనుకుంటే మేకి షిఫ్ట్ చేయొచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ప్యాన్ ఇండియా సినిమాలేవీ ఏప్రిల్ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణ ఎలక్షన్ల సమయంలో వాతావరణం ఇంత వేడిగా లేదు. కానీ ఏపీలో దానికి పూర్తి రివర్స్ లో ఉంది. పొలిటికల్ వార్ కంటే ఎంటర్ టైన్మెంట్ ఏముంటుందనే రీతిలో పబ్లిక్ కి కావాల్సిన కాలక్షేపం దొరికేలా ఉంది. విశాల్ రత్నం, విక్రమ్ తంగలాన్ లు ఆ నెలలో రావాలని చూస్తున్నాయి కానీ డేట్లు కొంచెం అటుఇటు కావొచ్చు. ఎలా చూసుకున్నా టాలీవుడ్ కు ఎన్నికల సెగ అంత సీరియస్ గా ఉండదనేద వాస్తవం.
This post was last modified on February 19, 2024 5:10 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…