సౌత్ దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్ గా కీర్తింబపడే లోకేష్ కనగరాజ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఖైదీ, విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ప్రధాన కారణంగా నిలిచింది వీళ్ళే. లియో యావరేజ్ గా ఉన్నా ఏపీ తెలంగాణలో లాభాలు తేవడానికి కారణం విజయ్ కు పెరిగిన మార్కెట్. అయితే లోకేష్ క్రియేటివిటీ మీద ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి. అతనివి స్వంత కథలు కావని, పాత వాటి నుంచి స్ఫూర్తి పొంది ట్రెండ్ కు అనుకూలంగా మార్చుకుని హిట్లు కొడతాడని అంటారు. కాస్త ఆలస్యంగా అయినా సరే లోకేష్ కాపీ ముద్ర ఒకటి స్పష్టంగా బయటపడింది.
మూడేళ్ళ క్రితం 2021లో వచ్చిన మాస్టర్ గుర్తుందిగా. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మంచి రికార్డులు సృష్టించింది. దీనికి మూలం 1989 మలయాళంలో వచ్చిన ముద్ర. అందులో మమ్ముట్టి హీరో. బాల నేరస్థులు ఉండే ఒక జైలుకి హీరో సూపర్ వైజర్ గా వస్తాడు. అక్కడి పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళతో స్థానిక ముఠాలు అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నాయని గుర్తిస్తాడు. ఈ క్రమంలో ఓ కుర్రాడు చనిపోతాడు. ఆ నేరం ఇతని మీద మోపేందుకు చూస్తారు. జైలు సెటప్, జువైనల్ హోమ్ ముద్రలో లాగా మాస్టర్ లో ఇదే తరహాలో ఉంటుంది.
చాలా సీన్లు మక్కీకి మక్కి దింపేశాడు లోకేష్. రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి ట్యాలీ చేస్తూ మరీ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ముద్ర మీద అవగాహన లేని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ మాట కొస్తే చిరంజీవి మాస్టర్ షేడ్స్ కొన్ని లోకేష్ తీసిన మాస్టర్ లోనూ ఉంటాయి. సరే స్ఫూర్తి పొందటం తప్పేమి కాదు కానీ ఇలా మరీ సన్నివేశాలన్నీ ఎత్తుకొచ్చి కొత్త సృష్టిలాగా చెప్పుకోవడం ఏమిటనేది నెటిజెన్ల కంప్లయింట్. సక్సెస్ ముందు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటారా. ప్రస్తుతం రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్నాడు.
This post was last modified on February 19, 2024 11:14 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…