బాలీవుడ్లో చాలా తక్కువ సమయంలో గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు నవాజుద్దీన్ సిద్దిఖి. ఆయన నట ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా చాలా సినిమాలే ఉన్నాయి. నసీరుద్దీన్ షా, ఓంపురి, ఇర్ఫాన్ ఖాన్ లాంటి లెజెండ్స్ తర్వాత అంతటి విలక్షణ నటుడిగా నవాజ్కు పేరు వచ్చింది. దక్షిణాదిన కూడా అతడికి డిమాండ్ ఏర్పడింది.
ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పేటలో అతణ్ని నటింపజేశాడు కార్తీక్ సుబ్బరాజ్. అంచనాలను అందుకోలేకపోయిన ఆ సినిమాలో నవాజ్ విలనీ బాగానే పేలింది. కానీ నవాజ్ మాత్రం ఆ సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట. తన పాత్రకు తాను న్యాయం చేయలేదని.. అలా చేయకుండా పారితోషకం తీసుకున్నందుకు గిల్టీగా అనిపించిందని అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
పేట సినిమా చేసేటపుడు తనకు తమిళం ఒక్క ముక్క కూడా రాదని.. దీంతో ఆ సినిమాలో నటించడం చాలా ఇబ్బంది అయిందని నవాజ్ చెప్పాడు. భాష అర్థం కాకపోవడంతో డైలాగులు సరిగా చెప్పలేకపోయానని.. ఏదో అలా లిప్ సింక్ ఇస్తూ మేనేజ్ చేశానని.. సినిమా చూసుకున్నపుడు తనకే సంతృప్తిగా అనిపించలేదని నవాజ్ అభిప్రాయపడ్డాడు. తాను న్యాయం చేయని పాత్రకు పారితోషకం తీసుకోవడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు.
ఐతే మళ్లీ తాను సౌత్లో సైంధవ్ సినిమాలో నటించానని.. ఈ సినిమాకు ముందు మాత్రం తాను తెలుగు భాష నేర్చుకుని, డైలాగుల మీద పట్టు సాధించి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నానని.. ఆ విషయంలో తానెంతో సంతృప్తి చెందానని నవాజ్ తెలిపాడు. ఐతే నవాజ్కు సంతృప్తినివ్వకపోయినా, డబ్బిగ్ తేడా కొట్టినా పేటలో తన రోలే బాగుంటుంది. కానీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సైంధవ్ సినిమా క్యారెక్టర్ మాత్రం మరీ నిరాశపరిచింది.
This post was last modified on February 16, 2024 10:10 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…