టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న హనుమాన్ చివరి దశకు వచ్చేసింది. ఆరో వారంలో అడుగు పెడుతున్న వేళ రన్ పూర్తవుతున్న విషయాన్ని గుర్తించి నైజాంలో టికెట్ రేట్లు తగ్గింపుకి పూనుకుని వసూళ్లకు మళ్ళీ జోష్ ఇచ్చే ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 23 వరకు నైజామ్ మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలు టికెట్ రేట్లు నిర్ణయించి ప్రేక్షకులను మళ్ళీ రప్పించే స్ట్రాటజీ వేశారు. వీకెండ్ తప్ప నిజానికి హనుమాన్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. మూడు వందల కేంద్రాల్లో ఉన్నా వసూళ్లు నెమ్మదించాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వంద రూపాయలకు పైగానే డిస్కౌంట్ అంటే ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో రెండు వారాలు పూర్తయితే హనుమాన్ అర్ధశతదినోత్సవం చేసుకుంటుంది. పెద్ద నెంబర్ లోనే ఈ మైలురాయిని అందివ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు చాలా వచ్చినప్పటికీ ఏవీ కనీసం యావరేజ్ అనిపించుకునే స్థాయిలో జనం మెప్పు పొందలేదు. అందుకే ప్రతి శని ఆదివారాలు తిరిగి హనుమాన్ కే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ ఊరుపేరు భైరవకోన ఒకటే నోటెడ్ మూవీ.
ఇప్పుడీ ఎత్తుగడ వల్ల అనూహ్యంగా వందల కోట్లు వచ్చేయవు కానీ డెఫిషిట్లు రాకుండా థియేటర్ మెయింటెనెన్స్ కు సరిపడా కలెక్షన్ అయితే వస్తుంది. రేటు తక్కువ ఉందని ఎక్కువ మంది వస్తే ఖర్చులు పోనూ లాభాలు పెరుగుతాయి. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్ లో రూపాయికి రెండు నుంచి పది రూపాయల దాకా లాభం ఇచ్చిన హనుమాన్ మార్చి మొదటి వారంలో ఓటిటి ప్రీమియర్ జరుపుకోవచ్చని టాక్. అందుకే ఏది చేసినా ఇంకో పదిహేను రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి. అక్కడితో హనుమాన్ కథ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ పరిమితుల వల్ల ఏపీలో ఈ వెసులుబాటు సాధ్యం కాదు.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…