టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న హనుమాన్ చివరి దశకు వచ్చేసింది. ఆరో వారంలో అడుగు పెడుతున్న వేళ రన్ పూర్తవుతున్న విషయాన్ని గుర్తించి నైజాంలో టికెట్ రేట్లు తగ్గింపుకి పూనుకుని వసూళ్లకు మళ్ళీ జోష్ ఇచ్చే ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 23 వరకు నైజామ్ మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలు టికెట్ రేట్లు నిర్ణయించి ప్రేక్షకులను మళ్ళీ రప్పించే స్ట్రాటజీ వేశారు. వీకెండ్ తప్ప నిజానికి హనుమాన్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. మూడు వందల కేంద్రాల్లో ఉన్నా వసూళ్లు నెమ్మదించాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వంద రూపాయలకు పైగానే డిస్కౌంట్ అంటే ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో రెండు వారాలు పూర్తయితే హనుమాన్ అర్ధశతదినోత్సవం చేసుకుంటుంది. పెద్ద నెంబర్ లోనే ఈ మైలురాయిని అందివ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు చాలా వచ్చినప్పటికీ ఏవీ కనీసం యావరేజ్ అనిపించుకునే స్థాయిలో జనం మెప్పు పొందలేదు. అందుకే ప్రతి శని ఆదివారాలు తిరిగి హనుమాన్ కే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ ఊరుపేరు భైరవకోన ఒకటే నోటెడ్ మూవీ.
ఇప్పుడీ ఎత్తుగడ వల్ల అనూహ్యంగా వందల కోట్లు వచ్చేయవు కానీ డెఫిషిట్లు రాకుండా థియేటర్ మెయింటెనెన్స్ కు సరిపడా కలెక్షన్ అయితే వస్తుంది. రేటు తక్కువ ఉందని ఎక్కువ మంది వస్తే ఖర్చులు పోనూ లాభాలు పెరుగుతాయి. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్ లో రూపాయికి రెండు నుంచి పది రూపాయల దాకా లాభం ఇచ్చిన హనుమాన్ మార్చి మొదటి వారంలో ఓటిటి ప్రీమియర్ జరుపుకోవచ్చని టాక్. అందుకే ఏది చేసినా ఇంకో పదిహేను రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి. అక్కడితో హనుమాన్ కథ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ పరిమితుల వల్ల ఏపీలో ఈ వెసులుబాటు సాధ్యం కాదు.
This post was last modified on February 16, 2024 5:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…