టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న హనుమాన్ చివరి దశకు వచ్చేసింది. ఆరో వారంలో అడుగు పెడుతున్న వేళ రన్ పూర్తవుతున్న విషయాన్ని గుర్తించి నైజాంలో టికెట్ రేట్లు తగ్గింపుకి పూనుకుని వసూళ్లకు మళ్ళీ జోష్ ఇచ్చే ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 23 వరకు నైజామ్ మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలు టికెట్ రేట్లు నిర్ణయించి ప్రేక్షకులను మళ్ళీ రప్పించే స్ట్రాటజీ వేశారు. వీకెండ్ తప్ప నిజానికి హనుమాన్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. మూడు వందల కేంద్రాల్లో ఉన్నా వసూళ్లు నెమ్మదించాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వంద రూపాయలకు పైగానే డిస్కౌంట్ అంటే ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో రెండు వారాలు పూర్తయితే హనుమాన్ అర్ధశతదినోత్సవం చేసుకుంటుంది. పెద్ద నెంబర్ లోనే ఈ మైలురాయిని అందివ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు చాలా వచ్చినప్పటికీ ఏవీ కనీసం యావరేజ్ అనిపించుకునే స్థాయిలో జనం మెప్పు పొందలేదు. అందుకే ప్రతి శని ఆదివారాలు తిరిగి హనుమాన్ కే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ ఊరుపేరు భైరవకోన ఒకటే నోటెడ్ మూవీ.
ఇప్పుడీ ఎత్తుగడ వల్ల అనూహ్యంగా వందల కోట్లు వచ్చేయవు కానీ డెఫిషిట్లు రాకుండా థియేటర్ మెయింటెనెన్స్ కు సరిపడా కలెక్షన్ అయితే వస్తుంది. రేటు తక్కువ ఉందని ఎక్కువ మంది వస్తే ఖర్చులు పోనూ లాభాలు పెరుగుతాయి. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్ లో రూపాయికి రెండు నుంచి పది రూపాయల దాకా లాభం ఇచ్చిన హనుమాన్ మార్చి మొదటి వారంలో ఓటిటి ప్రీమియర్ జరుపుకోవచ్చని టాక్. అందుకే ఏది చేసినా ఇంకో పదిహేను రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి. అక్కడితో హనుమాన్ కథ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ పరిమితుల వల్ల ఏపీలో ఈ వెసులుబాటు సాధ్యం కాదు.
This post was last modified on February 16, 2024 5:49 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…