ఎంత కళతో ముడిపడినదే అయినా సినిమా అనేది వ్యాపారం. పెట్టుబడి పెట్టిన ప్రతిఒక్కరు లాభాల కోసమే ఇండస్ట్రీకి వస్తారు. కానీ ప్రతిసారి సానుకూల ఫలితం ఉండదు. రిస్క్ కు సిద్ధపడే రావాలి. ఏదైనా తేడా వస్తే దాన్ని భరించే శక్తి ఉంటే తప్ప ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. రెండు కోట్లు పెట్టింది ఇరవై కోట్లు తేవొచ్చు. ఎనభై కోట్లు పెడితే పది కోట్లు వచ్చి నిండా మునగొచ్చు. దేనికీ గ్యారెంటీ లేదు. నిర్మాత అనిల్ సుంకర ఈ విషయంలో చెబుతున్న విషయాలు చాలా స్పష్టంగా, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల కోణంలో ఆలోచించేలా, అర్ధవంతంగా ఉన్నాయి.
ఊరుపేరు భైరవకోనను ఆపాలంటూ ఓ పంపిణీదారుడు ఏజెంట్ నష్టాలను ఉటంకిస్తూ కేసు ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. దీని వల్ల రిలీజ్ ఆగుతుందనే ప్రచారం జరిగింది. అయితే రెండిటికీ సంబంధం లేదని వివరణ ఇస్తూ నిర్మాణ సంస్థ సహేతుకమైన సమాధానం చెప్పడంతో వివాదం ముగిసింది. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అనిల్ సుంకర ఈ ప్రస్తావన వచ్చినపుడు రిస్కుకి సిద్ధపడే అందరూ బిజినెస్ చేస్తారని, నష్టం వచ్చినప్పుడు కేసులు వేయడం, లాభం వచ్చినప్పుడు నాకే కావాలని కోరుకోవడం తప్పని అన్నారు.
నేనింతేలో రవితేజ అన్నట్టు వచ్చినా పోయినా సినిమాలే ప్రపంచంగా బ్రతికే తనలాంటి వాళ్ళు ఎన్నో తట్టుకునే ఇక్కడ నిలబడతారని అన్నారు. తనను కష్టపెట్టొచ్చేమో కానీ బెదిరించలేరని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద కోపం లేదని, ఏదో ఆవేశంలో ఇబ్బంది పెట్టినా పెద్దగా పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఊరుపేరు భైరవకోన మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న అనిల్ సుంకర ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా రాజేష్ దండ నిర్మాత. సామజవరగమన ఇదే కలయికలో బ్లాక్ బస్టరైన సంగతి తెలిసిందే. ఈసారి అదే ఫలితం వస్తుందేమో చూడాలి.
This post was last modified on February 15, 2024 9:04 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…