ఎంత కళతో ముడిపడినదే అయినా సినిమా అనేది వ్యాపారం. పెట్టుబడి పెట్టిన ప్రతిఒక్కరు లాభాల కోసమే ఇండస్ట్రీకి వస్తారు. కానీ ప్రతిసారి సానుకూల ఫలితం ఉండదు. రిస్క్ కు సిద్ధపడే రావాలి. ఏదైనా తేడా వస్తే దాన్ని భరించే శక్తి ఉంటే తప్ప ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. రెండు కోట్లు పెట్టింది ఇరవై కోట్లు తేవొచ్చు. ఎనభై కోట్లు పెడితే పది కోట్లు వచ్చి నిండా మునగొచ్చు. దేనికీ గ్యారెంటీ లేదు. నిర్మాత అనిల్ సుంకర ఈ విషయంలో చెబుతున్న విషయాలు చాలా స్పష్టంగా, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల కోణంలో ఆలోచించేలా, అర్ధవంతంగా ఉన్నాయి.
ఊరుపేరు భైరవకోనను ఆపాలంటూ ఓ పంపిణీదారుడు ఏజెంట్ నష్టాలను ఉటంకిస్తూ కేసు ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. దీని వల్ల రిలీజ్ ఆగుతుందనే ప్రచారం జరిగింది. అయితే రెండిటికీ సంబంధం లేదని వివరణ ఇస్తూ నిర్మాణ సంస్థ సహేతుకమైన సమాధానం చెప్పడంతో వివాదం ముగిసింది. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అనిల్ సుంకర ఈ ప్రస్తావన వచ్చినపుడు రిస్కుకి సిద్ధపడే అందరూ బిజినెస్ చేస్తారని, నష్టం వచ్చినప్పుడు కేసులు వేయడం, లాభం వచ్చినప్పుడు నాకే కావాలని కోరుకోవడం తప్పని అన్నారు.
నేనింతేలో రవితేజ అన్నట్టు వచ్చినా పోయినా సినిమాలే ప్రపంచంగా బ్రతికే తనలాంటి వాళ్ళు ఎన్నో తట్టుకునే ఇక్కడ నిలబడతారని అన్నారు. తనను కష్టపెట్టొచ్చేమో కానీ బెదిరించలేరని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద కోపం లేదని, ఏదో ఆవేశంలో ఇబ్బంది పెట్టినా పెద్దగా పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఊరుపేరు భైరవకోన మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న అనిల్ సుంకర ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా రాజేష్ దండ నిర్మాత. సామజవరగమన ఇదే కలయికలో బ్లాక్ బస్టరైన సంగతి తెలిసిందే. ఈసారి అదే ఫలితం వస్తుందేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…