రేపు విడుదల కాబోతున్న ఊరు పేరు భైరవకోన మీద బాక్సాఫీస్ పెద్ద నమ్మకమే పెట్టుకుంది. ఎందుకంటే ఈ వారం చెప్పుకోదగ్గ మూవీ ఇదొక్కటే. రాజధాని ఫైల్స్ కి కోర్టు బ్రేకులు పడ్డాయి. మిగిలిన ఒకటి రెండు చిన్న సినిమాల గురించి కనీస ఊసు లేదు. గత వారం రిలీజైన వాటిలో ఈగల్ ఆల్రెడీ నెమ్మదించిపోగా యాత్ర 2 ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. రజనీకాంత్ ఉన్నా లాల్ సలామ్ ని కనీసం పట్టించుకున్న దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవు. బేబీ రేంజ్ లో ర్యాంప్ ఆడిస్తామని అదే నిర్మాతలు గొప్పగా చెప్పుకున్న తమిళ డబ్బింగ్ ట్రూ లవర్ కనీసం పబ్లిసిటీ ఖర్చులు తేలేదు.
సో ఇప్పుడు భారం మోయాల్సింది ఊరుపేరు భైరవకోననే. రెండు రోజుల ముందే ప్రధాన కేంద్రాల్లో ప్రీమియర్లు వేయడం ద్వారా దర్శక నిర్మాతలు తమ కాన్ఫిడెన్స్ చూపించారు. వాటిని చూసిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. రియల్ టాక్ ఏంటనేది రేపటికి స్పష్టత వస్తుంది. హారర్ జానర్ అయినప్పటికీ అన్ని వర్గాలు చూడరనే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే హిట్ కొట్టొచ్చని గతంలో విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, జాంబీ రెడ్డి లాంటివి నిరూపించాయి కాబట్టి టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ ని మెప్పిస్తే చాలు జనాలు హిట్ ఇస్తారు.
సందీప్ కిషన్, నిర్మాత అనిల్ సుంకరకు ఈ సక్సెస్ చాలా కీలకం. అలాగే దర్శకుడు విఐ ఆనంద్ తో చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఊరిపేరు భైరవకోన ఫలితం వాళ్ళను ముందడుగు వేసేలా చేస్తుంది. గత చిత్రం డిస్కో రాజాకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని ఈ సినిమాని పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా మలిచానని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎలాగూ వచ్చే వారం కూడా హైప్ ఉన్న రిలీజులు లేవు. ఊరిపేరు భైరవకోన నిలబడితే ఎంతలేదన్నా మార్చి 1 దాకా మంచి రన్ దక్కుతుంది. లాభాలు అందుకోవడానికి పదిహేను రోజులు సరిపోతాయి. అందుకే భైరవకోన మీద థియేటర్ల ఆశలన్నీ.
This post was last modified on February 15, 2024 5:56 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…