Movie News

కేసుల సుడిగుండంలో వివాదాస్పద సినిమాలు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ రాజకీయాలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. ఇవాళ విడుదలైన ‘రాజధాని ఫైల్స్’ని ఆపాలని వైసిపి నాయకుడు వేసిన కేసుకు స్పందించిన హై కోర్టు తదుపరి తీర్పు ఇచ్చే వరకు షోలు రద్దు చేయాలని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఆఘమేఘాల మీద విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్ జరుగుతుండగానే అధికారులు ప్రవేశించి ప్రేక్షకులను వెనక్కు పంపించారు. న్యాయస్థానం ఆదేశాలను చూపించమని కొందరు డిమాండ్ చేసినా వినకపోవడం గమనార్హం.

ఇంకోవైపు హైదరాబాద్ తో సహా తెలంగాణలో రాజధాని ఫైల్స్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మార్నింగ్ షోలు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. మరి కోర్టు ఆర్డర్లు ఈ రాష్ట్రానికి వర్తించవా లేదా అనేదాని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మూడు రాజధానుల అంశంతో పాటు అధికార పార్టీని అవమానించేలా సినిమా తీశారని పిటీషనర్ ప్రధాన ఆరోపణ. వచ్చే వారం 23 విడుదల కాబోతున్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఇదే తరహా కాంట్రావర్సిని ఎదుర్కుంటోంది. డిసెంబర్ లోనే రావాల్సిన ఈ సినిమా నారా లోకేష్ లేవనెత్తిన అభ్యంతరం వల్ల వాయిదా పడుతూ చివరికి మోక్షం దక్కించుకుంది.

వ్యూహం, శపథం రెండింటిలోనూ వర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలను దారుణంగా అవమానించే రీతిలో సన్నివేశాలు పెట్టారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నా ప్రస్తుతానికి అడ్డుకట్ట తొలగింది కానీ ఈ వారంలో ఇంకేదైనా మలుపు జరుగుతుందేమో చూడాలి. ‘యాత్ర 2’కి ఈ సమస్య రాలేదు. ఆడియన్స్ కూడా తిరస్కరించడంతో కంటెంట్ అంతగా హైలైట్ కాలేకపోయింది. నిజాం పాలనలో జరిగిన అరాచకాల బ్యాక్ డ్రాప్ లో రూపొంది మార్చి 1 రిలీజవుతున్న ‘రజాకార్’ మీద కూడా పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి సెగలు తప్పకపోవచ్చని టాక్.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

7 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago