అందం ఎందరిలోనో ఉంటుంది కానీ దానికి మించి నటించే టాలెంట్ అందరికీ ఉండదు. అందుకే సాయిపల్లవి ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ కథ నచ్చి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప ఎస్ చెప్పని ఈమెను ఒప్పించడం దర్శకులకు అంత సులభం కాదు. డాన్స్ పరంగా తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ లో ముందు ఆఫర్ చేస్తే రీమేక్ అనే ఒకే కారణంతో చేయనని చెప్పేసింది. ఇలాంటి తిరస్కారాలు బోలెడున్నాయి. సూర్యతో చేసిన ఎన్జికె ఒక్కటే తొందరపడి ఒప్పుకున్న సినిమాగా కనిపిస్తుంది.
ప్రస్తుతం సాయిపల్లవి లైనప్ చూస్తే భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసే సబ్జెక్టులకు మాత్రమే ఓటేస్తోంది. తండేల్ లో స్నేహితుల కోసం పాకిస్థాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడి కోసం పోరాటం చేసే యువతీగా దర్శకుడు చందూ మొండేటి తన పాత్రను చాలా డెప్త్ గా డిజైన్ చేశాడట. శివ కార్తికేయన్ సరసన చేస్తున్న మూవీలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా కనిపిస్తుందని చెన్నై టాక్. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం హీరో నిజంగానే కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకోవడం విశేషం. ఈ తరహా జానర్ ని మేజర్ తో అడవి శేష్ మొదలుపెట్టాడు.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జట్టుకట్టిన చిత్రం కూడా హెవీ లవ్ ఎమోషన్స్ తో ఉంటుందట. ప్రస్తుతం దీని షూటింగ్ కీలక దశలో ఉంది. విదేశాల్లో షెడ్యూల్ జరుగుతోంది. ఈ మూడు తప్ప ఇంకెవరికి సాయిపల్లవి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. విరాట పర్వం లాంటివి డిజాస్టర్ అయినా సరే పాత్రను ప్రేమిస్తే వాటి కమర్షియల్ లెక్కలు ఆలోచించకుండా ఓకే చెప్పే ఫిదా భానుమతికి ధనుష్ నాగార్జున మల్టీస్టారర్ కోసం శేఖర్ కమ్ముల అడిగారట. కానీ ఎందుకో నో చెప్పడంతో రష్మిక మందన్నకు వెళ్లిందని వినికిడి. అవకాశాలు వస్తున్నా ఇంత పట్టుదలగా ఉండటం ఇప్పటి హీరోయిన్లలో అరుదే.
This post was last modified on February 15, 2024 3:10 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…