నిన్న విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ యూత్ కి బాగానే కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. మొదటి భాగం కథకు ఖచ్చితమైన కొనసాగింపు కాకపోయినా పాత్రలు వాటి మధ్య సంబంధాలు కంటిన్యూ చేయడంతో ఈసారి ఆసక్తి మరింత ఎక్కువవుతోంది. సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ని దర్శకుడు మల్లిక్ రామ్ సమతూకం చేసిన విధానం క్రేజ్ ని పెంచుతోంది. నిన్న రాత్రే బిజినెస్ కాల్స్ ఎక్కువయ్యాయని సితార కాంపౌండ్ టాక్. వరల్డ్ వైడ్ రైట్స్ కోసం ఒక ఓవర్సీస్ సంస్థ పెద్ద మొత్తాన్ని కోట్ చేసిందని వినికిడి. నిర్మాత నాగ వంశీ తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
ఇక అసలు పాయింట్ కు వస్తే టిల్లు స్క్వేర్ లో ముందు తీసుకున్న హీరోయిన్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ అయ్యాక తాను చేయలేనని తప్పుకున్నాక అనుపమ పరమేశ్వరన్ ని కలుసుకున్నారు. ఆమె కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కొంత టైం తీసుకుని చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే శ్రీలీల ఎందుకు నో చెప్పిందనే కారణాలు ట్రైలర్ లో కనిపించాయి. సుదీర్ఘమైన లిప్ లాకులతో పాటు ట్రెండీ కాస్ట్యూమ్స్ కు అనుపమ మొహమాటపడకుండా ఒప్పుకుంది. మూడు నిమిషాల వీడియోలోనే అంత ఉంటే ఇక ఫుల్ మూవీలో ఏ స్థాయిలో రొమాన్స్ ఉంటుందో వేరే చెప్పాలా.
ఇలా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందనే శ్రీలీల టిల్లు స్క్వేర్ వద్దనుకుని ఉండొచ్చనే కామెంట్ సహేతుకంగానే ఉంది. ఎందుకంటే ఈమె ఇప్పటిదాకా ఎక్స్ పోజింగ్, ఆధర చుంబనాలు చేయలేదు. కుర్చీ మడత పెట్టి లాంటి ఊర మాస్ పాటలోనూ చీరకట్టు పద్ధతిగానే మేనేజ్ చేసింది. అలాంటిది సిద్దుతో పెదవి పెదవి కలుపుతూ ముద్దులకు అంగీకరించడం కష్టం కదా. మార్చి 29 టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక తన నిర్ణయం రైటా రాంగా అనేది తేలిపోతుంది కానీ మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ లోని కొత్త యాంగిల్ ని పరిచయం చేయడంతో టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెసయ్యాడు.
This post was last modified on February 15, 2024 11:34 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…