నిన్న విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ యూత్ కి బాగానే కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. మొదటి భాగం కథకు ఖచ్చితమైన కొనసాగింపు కాకపోయినా పాత్రలు వాటి మధ్య సంబంధాలు కంటిన్యూ చేయడంతో ఈసారి ఆసక్తి మరింత ఎక్కువవుతోంది. సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ని దర్శకుడు మల్లిక్ రామ్ సమతూకం చేసిన విధానం క్రేజ్ ని పెంచుతోంది. నిన్న రాత్రే బిజినెస్ కాల్స్ ఎక్కువయ్యాయని సితార కాంపౌండ్ టాక్. వరల్డ్ వైడ్ రైట్స్ కోసం ఒక ఓవర్సీస్ సంస్థ పెద్ద మొత్తాన్ని కోట్ చేసిందని వినికిడి. నిర్మాత నాగ వంశీ తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
ఇక అసలు పాయింట్ కు వస్తే టిల్లు స్క్వేర్ లో ముందు తీసుకున్న హీరోయిన్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ అయ్యాక తాను చేయలేనని తప్పుకున్నాక అనుపమ పరమేశ్వరన్ ని కలుసుకున్నారు. ఆమె కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కొంత టైం తీసుకుని చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే శ్రీలీల ఎందుకు నో చెప్పిందనే కారణాలు ట్రైలర్ లో కనిపించాయి. సుదీర్ఘమైన లిప్ లాకులతో పాటు ట్రెండీ కాస్ట్యూమ్స్ కు అనుపమ మొహమాటపడకుండా ఒప్పుకుంది. మూడు నిమిషాల వీడియోలోనే అంత ఉంటే ఇక ఫుల్ మూవీలో ఏ స్థాయిలో రొమాన్స్ ఉంటుందో వేరే చెప్పాలా.
ఇలా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందనే శ్రీలీల టిల్లు స్క్వేర్ వద్దనుకుని ఉండొచ్చనే కామెంట్ సహేతుకంగానే ఉంది. ఎందుకంటే ఈమె ఇప్పటిదాకా ఎక్స్ పోజింగ్, ఆధర చుంబనాలు చేయలేదు. కుర్చీ మడత పెట్టి లాంటి ఊర మాస్ పాటలోనూ చీరకట్టు పద్ధతిగానే మేనేజ్ చేసింది. అలాంటిది సిద్దుతో పెదవి పెదవి కలుపుతూ ముద్దులకు అంగీకరించడం కష్టం కదా. మార్చి 29 టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక తన నిర్ణయం రైటా రాంగా అనేది తేలిపోతుంది కానీ మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ లోని కొత్త యాంగిల్ ని పరిచయం చేయడంతో టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెసయ్యాడు.
This post was last modified on February 15, 2024 11:34 am
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…