తెలుగు సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. చేసిన ప్రతి పాత్రలో ప్రత్యేకతను చాటుకున్న జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెరపై ఆయన వేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు విలన్గా, అటు కమెడియన్గా ఒకే స్థాయిలో మెప్పించడం అరుదైన విషయం. నాటక రంగంలో కూడా జయప్రకాష్ రెడ్డికి గొప్ప పేరుంది.
ఆయన సినిమాల్లోకి రాకముందు, ఆ తర్వాత కూడా నాటకాల్లో మెరిశారు. ఆ రంగంలో జయప్రకాష్ రెడ్డి పేరెత్తగానే గుర్తుకొచ్చే నాటకం.. అలెగ్జాండర్. జయప్రకాష్ రెడ్డి ఎంతో ముచ్చటపడి రాయించుకుని నటించిన నాటకం ఇది. దీన్ని సినిమా రూపంలోకి కూడా తేవాలని, ప్రేక్షకులకు చూపించాలని ఆయన తపించారు. కానీ ఆ కల సగంలోనే ఆగిపోయింది.
చాలా ఏళ్ల కిందటే ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం సహాయంతో ‘అలెగ్జాండర్’ చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు జయప్రకాష్ రెడ్డి. 100 నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకంలో జయప్రకాష్ రెడ్డి ఒక్కరే తెరపై కనిపిస్తారు. ఆయనతో ఫోన్లో మాట్లాడే పాత్రలుగా కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు లాంటి వాళ్లు గాత్రాన్ని అందించారు.
ఐతే సినిమా పూర్తి చేశారు కానీ.. అది విడుదలకు నోచుకోలేదు. దీని విడుదల కోసం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కథలో తను చెప్పదలుచుకున్న సందేశాన్ని చూసేందుకు అయినా… ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలి అంటూ ఆయన కొన్ని సందర్భాల్లో తన కోరికను వెల్లడించారు. థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని.. కనీసం ఓటీటీ ద్వారా అయినా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని అనుకున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గుండెపోటులో హఠాత్తుగా కన్నుమూశారు. అలా ఆయన కల తీరకుండానే మిగిలిపోయింది.
This post was last modified on September 9, 2020 10:38 am
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…