ఎన్నికల వాతావరణంలో రాజకీయ సినిమాల తాకిడి పెరుగుతోంది. యాత్ర 2తో బోణీ జరిగింది కానీ ఊహించిన దాని కన్నా చాలా తక్కువ ఫలితం దక్కడం నిర్మాతలకు షాకే. ఎల్లుండి రాజధాని ఫైల్స్ ని తీసుకొస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ అంటూ ఎవరు లేరు. దర్శకుడి గురించి ప్రేక్షకులకు తెలిసింది సున్నా. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ లాంటి సీనియర్లు తప్ప మిగిలిన తారాగణమంతా కొత్త మొహాలే కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఏపి అధికార పార్టీ అవలంబించిన విధానాన్ని ఎండగడుతూ ఈ చిత్రం తీసిన వైనం ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది.
ఇదంతా బాగానే ఉంది కానీ బాక్సాఫీస్ వద్ద రాజధాని ఫైల్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది టాక్ ఎలా వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించి పొలిటికల్ డ్రామాల పట్ల ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. యాత్ర 2లో అది అర్థమైపోయింది. పైగా రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం, శపథంలను కేవలం వారం గ్యాప్ లో విడుదల చేయడానికి సిద్ధ పడటం ఇంకో ఆసక్తికరమైన పరిణామం. తన సినిమాలను జనం పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే కానీ యాత్ర 2 లాగే ఇవి జగన్ కి ఎలివేషన్ ఇవ్వడానికి తీసినవే.
సో రాజధాని ఫైల్స్ ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అంత ఈజీగా చెప్పలేం. పైగా న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లో కొన్ని వందల వేల సార్లు చదివిన రాజధాని సంఘటనలను మళ్ళీ తెరమీద చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తారా అంటే పండించిన డ్రామా మీద ఆధారపడి ఉంటుంది. భాను దర్శకత్వం వహించిన రాజధాని ఫైల్స్ కి మణిశర్మ లాంటి సీనియర్ మ్యుజీషియన్ ని తీసుకోవడం టెక్నికల్ గా స్థాయిని పెంచింది. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు రాలేదు. ఒకవేళ షోలు పడ్డాక ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమో చూడాలి.
This post was last modified on February 13, 2024 6:08 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…