ఎన్నికల వాతావరణంలో రాజకీయ సినిమాల తాకిడి పెరుగుతోంది. యాత్ర 2తో బోణీ జరిగింది కానీ ఊహించిన దాని కన్నా చాలా తక్కువ ఫలితం దక్కడం నిర్మాతలకు షాకే. ఎల్లుండి రాజధాని ఫైల్స్ ని తీసుకొస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ అంటూ ఎవరు లేరు. దర్శకుడి గురించి ప్రేక్షకులకు తెలిసింది సున్నా. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ లాంటి సీనియర్లు తప్ప మిగిలిన తారాగణమంతా కొత్త మొహాలే కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఏపి అధికార పార్టీ అవలంబించిన విధానాన్ని ఎండగడుతూ ఈ చిత్రం తీసిన వైనం ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది.
ఇదంతా బాగానే ఉంది కానీ బాక్సాఫీస్ వద్ద రాజధాని ఫైల్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది టాక్ ఎలా వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించి పొలిటికల్ డ్రామాల పట్ల ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. యాత్ర 2లో అది అర్థమైపోయింది. పైగా రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం, శపథంలను కేవలం వారం గ్యాప్ లో విడుదల చేయడానికి సిద్ధ పడటం ఇంకో ఆసక్తికరమైన పరిణామం. తన సినిమాలను జనం పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే కానీ యాత్ర 2 లాగే ఇవి జగన్ కి ఎలివేషన్ ఇవ్వడానికి తీసినవే.
సో రాజధాని ఫైల్స్ ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అంత ఈజీగా చెప్పలేం. పైగా న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లో కొన్ని వందల వేల సార్లు చదివిన రాజధాని సంఘటనలను మళ్ళీ తెరమీద చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తారా అంటే పండించిన డ్రామా మీద ఆధారపడి ఉంటుంది. భాను దర్శకత్వం వహించిన రాజధాని ఫైల్స్ కి మణిశర్మ లాంటి సీనియర్ మ్యుజీషియన్ ని తీసుకోవడం టెక్నికల్ గా స్థాయిని పెంచింది. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు రాలేదు. ఒకవేళ షోలు పడ్డాక ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమో చూడాలి.
This post was last modified on February 13, 2024 6:08 pm
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…
నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు.…
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని…
టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ..…