కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సరే బ్రహ్మరథం దక్కించుకోవడం చూస్తున్నాం. మన దగ్గర బలగం లాంటివి ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. తాజాగా మలయాళంలో రిలీజైన ప్రేమలు సంచలనం సృష్టించే దిశగా వసూళ్లు సాధిస్తోంది. విశేషం ఏంటంటే ఇది పూర్తిగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లవ్ డ్రామా. గిరీష్ దర్శకత్వం వహించగా మొదటి రోజు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగు పెట్టింది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తీస్తే వారం తిరక్కుండానే 6 కోట్లు దాటేసి కనీసం యాభై కోట్లకు పైగా రాబడుతుందనే అంచనాతో పరుగులు పెడుతోంది.
దీని గురించి మనమెందుకు చెప్పుకోవాలంటే ఈ ప్రేమలు తెలంగాణ నేపథ్యంలో జరుగుతుంది. చదువులో బ్యాక్ లాగ్స్ తో సతమతమయ్యే ఒక కుర్రాడు యుకెకి వెళ్లి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు. అదే సమయంలో చురుకుగా ఉండే ఓ అమ్మాయి తన మొదటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఇద్దరూ ఒక పెళ్లి సందర్భంలో కలుసుకుంటారు. గేట్ పరీక్ష కోసం ఫ్రెండ్ తో కలిసి కోచింగ్ తీసుకుంటున్న కుర్రాడికి, లైఫ్ పట్ల చాలా క్లారిటీ ఉన్న ఉద్యోగిని ఎలా ప్రేమ పుట్టిందనేది మెయిన్ పాయింట్. బోలెడు సబ్ ప్లాట్స్ కథలో భాగంగా వస్తాయి.
లైన్ పరంగా వింటే ఎలాంటి కొత్తదనం అనిపించదు కానీ సహజమైన సంభాషణలు, భావోద్వేగాలు, చక్కని హాస్యంతో దర్శకుడు గిరీష్ ఈ ప్రేమలుని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఇదే తరహాలో ప్రేమమ్ సాధించిన విజయం సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి కానుకగా ఇచ్చింది. ఇప్పుడు ప్రేమలులో కూడా అలాంటి క్యాస్టింగ్ బోలెడు ఉంది. టాలీవుడ్ నిర్మాతలు కొందరు రీమేక్ చేయాలా లేక డబ్బింగ్ చేయాలా అనే ఆలోచనలో ఇప్పటికీ ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలను సంప్రదించారట. ఎవరికి దక్కుతుందో చూడాలి.
This post was last modified on February 13, 2024 4:49 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…