షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బుల్లితెర నటి ఒకరు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న వైనం.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. మనసు మమత.. మౌనరాగం తదితర సీరియల్స్ లో నటించి.. ప్రజాదరణ పొందిన శ్రావణి ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్56 బ్లాక్ రెండో ఫ్లోర్ లో ఆమె నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లిన ఆమె.. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు.
ఎంతసేపు తలుపు తట్టినా స్పందించకపోవటంతో బాత్రూం తలుపును పగలగొట్టారు. అప్పటికే ఆమె బాత్రూంలో ఊరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు.
వెంటనే ఆమెను తీసుకొని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్దారించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి.. ఆసుపత్రికి వెళ్లారు.
ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ షురూ చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తెలుగు టీవీ సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు. పాపులర్ నటిగా సుపరిచితమైన ఆమె ఆత్మహత్య సంచలనంగా మారింది.
This post was last modified on September 9, 2020 8:56 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…