షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బుల్లితెర నటి ఒకరు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న వైనం.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. మనసు మమత.. మౌనరాగం తదితర సీరియల్స్ లో నటించి.. ప్రజాదరణ పొందిన శ్రావణి ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్56 బ్లాక్ రెండో ఫ్లోర్ లో ఆమె నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లిన ఆమె.. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు.
ఎంతసేపు తలుపు తట్టినా స్పందించకపోవటంతో బాత్రూం తలుపును పగలగొట్టారు. అప్పటికే ఆమె బాత్రూంలో ఊరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు.
వెంటనే ఆమెను తీసుకొని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్దారించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి.. ఆసుపత్రికి వెళ్లారు.
ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ షురూ చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తెలుగు టీవీ సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు. పాపులర్ నటిగా సుపరిచితమైన ఆమె ఆత్మహత్య సంచలనంగా మారింది.
This post was last modified on September 9, 2020 8:56 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…