కమెడియన్లు హీరోలు కావడం చాలాసార్లు జరిగిందే. బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ, రాజబాబు ఇలా ఎందరో స్క్రీన్ మీద కథానాయకులుగా కనిపించారు. సునీల్ ఏకంగా కొన్నేళ్ల పాటు సోలో హీరోగా మార్కెట్ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వెన్నెల కిషోర్ వీళ్ళ బాటలో నడుస్తున్నాడు. కాకపోతే సీరియస్ కామెడీ రెండూ మిక్స్ చేసి చారి 111 పేరుతో స్పై కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇండియా పాకిస్థాన్ మధ్య 1992లో జరిగిన ఒప్పందాన్ని కొందరు శత్రువులు ఉల్లంఘిస్తే దాన్ని ఛేదించే మిషన్ ని చారి ఛేదించడమనే పాయింట్ తో రూపొందించారు.
మాములుగా స్పై డ్రామాలు సీరియస్ గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం వినోదాత్మకంగా మార్చేశారు. ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవి చంటబ్బాయ్ క్యారెక్టరైజేషన్ ని అడవి శేష్ గూఢచారికి కలిపితే ఎలా ఉంటుందో చారి 111 అచ్చం అలా ఉందన్న మాట. దర్శకుడు టిజి కీర్తి కుమార్ ఏదో విభిన్నంగా ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మధ్య చాలా సినిమాల్లో వెన్నెల కిషోర్ చేస్తున్న పాత్రలు రొటీన్ టచ్ తో ఉంటున్నాయి. దాంట్లో అతని తప్పేమి లేకపోయినా తన ఎనర్జీని వాడుకునేలా కామెడీ ఎపిసోడ్స్ రాయలేకపోతున్నారు. మరి చారి 111 ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
బడ్జెట్ గట్రా గట్టిగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. అయినా హాస్య నటుల కోసం థియేటర్లకు ప్రేక్షకుల ఎంత మేరకు వస్తారనేది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్చి 1 వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో పోటీకి సిద్ధమైన ఈ చారికి లోకల్ ప్లస్ ఫారిన్ టచ్ రెండూ ఇచ్చారు. మురళి శర్మకో కీలక పాత్ర దక్కించింది .వెన్నెల కిషోర్ లీడ్ గా గతంలో వెన్నెల వన్ అండ్ హాఫ్ వచ్చింది కానీ ఆడలేదు. చారి 111లో క్వాలిటీ కనిపిస్తోంది. సంక్రాంతి నుంచి కమర్షియల్ సినిమాలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆడియన్స్ కి ఏమైనా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించి మెప్పితే హిట్టు పడొచ్చు.
This post was last modified on February 12, 2024 1:55 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…