తాజాగా విడుదలైన ఈగల్ కు డివైడ్ టాక్ నడుస్తోంది. పూర్తి యాక్షన్ కంటెంట్ తో ఆ జానర్ పప్రేమికులను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొంత మేర సంతృప్తి పరిచినా సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంత డోస్ ఎక్కడం లేదని టాకులు, రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. సరే ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకొంచం టైం పడుతుంది కానీ ఈగల్ ఎండ్ క్రెడిట్స్ లో టీమ్ చిన్న షాక్ ఇచ్చింది. అదే ఈగల్ 2. సలార్ కు శౌర్యంగ పర్వం లాగా దీనికి యుద్ధకాండ అని నామకరణం చేశారు. మొదటి భాగం తలకోనలో జరిగితే రెండో భాగం విదేశాల్లో ఉంటుందనే రీతిలో కొన్ని విజువల్స్ కూడా చూపించారు.
కాకపోతే నిజంగా తెరకెక్కిస్తారా లేదానేది వేచి చూడాలి. ఆ మధ్య స్కందలోనూ బోయపాటి శీను ఇలాగే ఊరించాడు. తీరా డిజాస్టర్ అయ్యేసరికి అందరూ గప్ చుప్. కథను అసంపూర్ణంగా ముగించినప్పటికీ కంటిన్యూ చేసే ఛాన్స్ లేనట్టే. కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా ఇదే తరహాలో సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందు ప్రమోషన్లలో, రిలీజయ్యాక క్లైమాక్స్ లో చెప్పారు. కానీ దర్శక నిర్మాత అభిషేక్ నామా అంత సుముఖంగా లేరని అర్థమవుతోంది. ఇప్పుడు ఈగల్ 2 యుద్ధకాండ నిజంగా కార్యరూపం దాలుస్తుందా అంటే సమాధానం నిర్మాత టిజి విశ్వప్రసాద్ దగ్గరే ఉంది.
ఏది ఏమైనా షూటింగ్ స్టేజిలోనే ఇలా పార్ట్ 2లకు తగ్గట్టు ఎండింగ్ లు రాసుకోవడం అంతగా వర్కౌట్ కావడం లేదు. సైంధవ్ కు శైలేష్ కొలను ఇలాగే చేయబోయి చేతులు కాల్చుకున్నాడు. వెంకటేష్ పోషించిన సైకో పాత్రకు ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లోనే చూపించి ఉంటే కంటెంట్ స్థాయి పెరిగేది. కానీ దాన్ని రెండో భాగం చూపించాలనే తాపత్రయంలో సైంధవ్ ని సాగదీయడంతో అభిమానులకే నచ్చలేదు. మరి ఈగల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చివరి ఫలితం వచ్చాక తేలుతుంది. కార్తీక్ ఘట్టమనేని ఆల్రెడీ మంచు మనోజ్- తేజ సజ్జలతో ఇంకో మూవీ చేస్తున్నాడట.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…