ఎలాంటి అంచనాలు లేకుండా గత అక్టోబర్ లో విడుదలైన బాలీవుడ్ మూవీ 12త్ ఫెయిల్ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చాక కూడా దీనికి సంబంధించిన ఏదో ఒక విశేషం నమోదవుతూనే ఉంది. తాజాగా ఐఎండిబి ప్రకటించిన టాప్ 250 ప్రపంచ సినిమాల్లో ఈ మూవీ 50వ స్థానం దక్కించుకుంది. ప్రత్యేకత ఇది కాదు. యాభై లోపు ఇంకే భారతీయ చిత్రం లేకపోవడం ఈ కల్ట్ క్లాసిక్ స్థాయి ఏంటో తెలియజేస్తోంది. ఇలాంటివి విన్నప్పుడు చనిపోయినా పర్వాలేదనిపిస్తోందని దర్శకుడు విధు వినోద్ చోప్రా చెప్పడం చూస్తే ఎంత ఎమోషనలయ్యారో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి 12 ఫెయిల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు విధు వినోద్ చోప్రా భార్య ప్రముఖ క్రిటిక్ అనుపమా చోప్రా ఫస్ట్ కాపీ చూసి డైరెక్ట్ ఓటిటికి ఇచ్చేయమని చెప్పారు. దీన్ని థియేటర్లకు వచ్చి ఎవరూ చూడరని జీవిత భాగస్వామే చెప్పడంతో ఆయన అయోమయానికి గురయ్యారు. అయితే ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై లక్షలు రావడమే గొప్పని బెదిరించినా సరే నెరవకుండా రిలీజ్ చేసుకున్నారు. కట్ చేస్తే వంద కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇటీవలే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తే మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
సినిమా నచ్చితే చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చెప్పేందుకు 12త్ ఫెయిల్ గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. మన దగ్గర బలగం లాంటివి ఈ సత్యాన్నే ఋజువు చేశాయి. బడ్జెట్ ఎంత పెట్టారనే దానికన్నా ఎంత బాగా తీశారనేదే జనాలు పట్టించుకుంటున్నారు. 12త్ ఫెయిల్ ని ఆస్కార్ కు పంపించే ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేదు. రిలీజ్ టైంలో తెలుగు డబ్బింగ్ చేసినా సరైన ప్రమోషన్లు లేక మన దగ్గర రీచ్ రాలేదు. హీరో విక్రాంత్ మాస్సే డిమాండ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళింది. రాజ్ కుమార్ హిరానీ నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
This post was last modified on February 9, 2024 8:57 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…