ఓటిటిల కాలంలో జనాలు కొత్త సినిమాలను శాటిలైట్ ఛానల్స్ లో చూడటం బాగా తగ్గించేశారు. అందుకే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే టిఆర్పి రేటింగ్స్ రావడం కష్టమైపోయింది. గత ఏడాది బలగం, వీరసింహారెడ్డి లాంటి వాటికి మినహాయించి మిగిలినవి పెద్దగా అద్భుతలేం చేయలేదు. వాల్తేరు వీరయ్య సైతం వెనుకబడింది. తాజాగా భగవంత్ కేసరికి వేసిన ప్రీమియర్ కు అర్బన్ నుంచి ఏకంగా 9.36 రేటింగ్ రావడం విశేషం. ఇంకోవైపు స్కందకు 8.47 నమోదు కావడం గమనార్హం. రెండింటి బాక్సాఫీస్ ఫలితాలు ఒకటే కాకపోయినా బుల్లితెరపై మాత్రం దుమ్ము దులపడం విశేషం.
ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. బాలయ్యకు ఇళ్లలో ఉన్న ఫాలోయింగ్ వాటిలో ప్రధానమైంది. గత ఏడాది వీరసింహారెడ్డి, అంతకు ముందు అఖండ సైతం టీవీలో భారీ స్పందన దక్కించుకున్నాయి. భగవంత్ కేసరిలో శ్రీలీల సెంటిమెంట్ ప్రధాన ఎలిమెంట్ గా మారడంతో చూసే వాళ్ళ కౌంట్ పెరిగింది. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురైన స్కందకి ఈ స్థాయిలో జనాలు చూడటం ఆశ్చర్యమే. థియేటర్లలో రిలీజైన టైంలో నెగటివ్ టాక్ విని దూరంగా ఉండిపోయిన ఆడియన్స్ ఎక్కువ. వాళ్లంతా టీవీ ప్రీమియర్ చూసి ఆ ముచ్చట తీర్చుకున్నారు.
దర్శకుడు బోయపాటి శీనుకి గతంలో వినయ విధేయ రామకు ఇలాగే జరిగింది. బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా పోతే ఛానల్ లో ఎన్నిసార్లు వచ్చినా మంచి రేటింగ్స్ తో భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఓటిటిల వల్ల శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న టైంలో ఇలాంటి రేటింగ్స్ ఎంతైనా నిర్మాతలకు ఊపిరినిచ్చేవే. డిజిటల్ మార్కెట్ వల్ల టీవీ చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. వేసిన టైంలో యాడ్స్ ని భరిస్తూ మూడు గంటల సేపు కూర్చునే ఓపిక తగ్గిపోతోంది. అందుకే టిఆర్పి తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పటికీ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
This post was last modified on February 8, 2024 6:05 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…