సూపర్ స్టార్ రజనీకాంత్ డబ్బింగ్ సినిమాలకు గాయకుడు మనో గొంతుగా ఎంతగా అలవాటు పడ్డామంటే ఆ విషయం తెలియని వాళ్ళు నిజంగానే తలైవర్ తెలుగులో మాట్లాడాడు అనుకునేంత. కానీ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లాల్ సలామ్ లో డైలాగ్ కింగ్ సాయికుమార్ తో మాటలు చెప్పించడం విని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆలస్యంగా వచ్చిన ట్రైలర్ లో చాలా గంభీరంగా వస్తున్న రజని వాయిస్ విని ఏదో తేడాగా అనిపిస్తున్న మాట వాస్తవం. అసలు మనోతో కాకుండా సాయికుమార్ తో ఎందుకు చెప్పించారన్న అనుమానం అభిమానులను వెంటాడుతోంది.
చెప్పుకోవాల్సిన ట్విస్టు మరొకటి ఉంది. ఒకప్పుడు అంటే ముప్పై ఏళ్ళ క్రితం రజనీకాంత్ కు అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే. బాషా, పెదరాయుడు, బిర్లా రాముడు, రాజా చిన్న రోజా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఈయన గొంతు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బాషాలో నేనొక్కసారి చెబితే అంటూ బెదిరించే సన్నివేశాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. తర్వాత తను పోలీస్ స్టోరీతో హీరో అయిపోవడంతో మనో తెరమీదకు వచ్చాడు. నరసింహతో మొదలుపెట్టి మొన్న జైలర్ దాకా పర్ఫెక్ట్ గా సింక్ కావడం చూసిందే. ఇప్పటి తరానికి ఇదే అలవాటయ్యింది.
ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ సాయికుమార్ తో చెప్పించడం వింతగా అనిపించడం పెద్ద విచిత్రం. లాల్ సలామ్ బిజినెస్ కేవలం రజని ఇమేజ్ మీద జరుగుతోంది. విష్ణు విశాల్ హీరో అయినప్పటికీ సూపర్ స్టార్ పాత్రనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక సాయికుమార్ మళ్ళీ డబ్బింగులు చెబుతున్నారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు ఎవడైతే నాకేంటితో మొదలుపెట్టి మొన్నటి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ దాకా గాత్రం ఇచ్చారు కానీ ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాపులే. మరి రజనికి లాల్ సలాం రూపంలో డైలాగ్ కింగ్ ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…