సూపర్ స్టార్ రజనీకాంత్ డబ్బింగ్ సినిమాలకు గాయకుడు మనో గొంతుగా ఎంతగా అలవాటు పడ్డామంటే ఆ విషయం తెలియని వాళ్ళు నిజంగానే తలైవర్ తెలుగులో మాట్లాడాడు అనుకునేంత. కానీ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లాల్ సలామ్ లో డైలాగ్ కింగ్ సాయికుమార్ తో మాటలు చెప్పించడం విని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆలస్యంగా వచ్చిన ట్రైలర్ లో చాలా గంభీరంగా వస్తున్న రజని వాయిస్ విని ఏదో తేడాగా అనిపిస్తున్న మాట వాస్తవం. అసలు మనోతో కాకుండా సాయికుమార్ తో ఎందుకు చెప్పించారన్న అనుమానం అభిమానులను వెంటాడుతోంది.
చెప్పుకోవాల్సిన ట్విస్టు మరొకటి ఉంది. ఒకప్పుడు అంటే ముప్పై ఏళ్ళ క్రితం రజనీకాంత్ కు అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే. బాషా, పెదరాయుడు, బిర్లా రాముడు, రాజా చిన్న రోజా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఈయన గొంతు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బాషాలో నేనొక్కసారి చెబితే అంటూ బెదిరించే సన్నివేశాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. తర్వాత తను పోలీస్ స్టోరీతో హీరో అయిపోవడంతో మనో తెరమీదకు వచ్చాడు. నరసింహతో మొదలుపెట్టి మొన్న జైలర్ దాకా పర్ఫెక్ట్ గా సింక్ కావడం చూసిందే. ఇప్పటి తరానికి ఇదే అలవాటయ్యింది.
ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ సాయికుమార్ తో చెప్పించడం వింతగా అనిపించడం పెద్ద విచిత్రం. లాల్ సలామ్ బిజినెస్ కేవలం రజని ఇమేజ్ మీద జరుగుతోంది. విష్ణు విశాల్ హీరో అయినప్పటికీ సూపర్ స్టార్ పాత్రనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక సాయికుమార్ మళ్ళీ డబ్బింగులు చెబుతున్నారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు ఎవడైతే నాకేంటితో మొదలుపెట్టి మొన్నటి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ దాకా గాత్రం ఇచ్చారు కానీ ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాపులే. మరి రజనికి లాల్ సలాం రూపంలో డైలాగ్ కింగ్ ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి.
This post was last modified on February 7, 2024 10:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…