విడుదల తేదీల వాయిదా ప్రహసనం కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రావాల్సిన విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ని మార్చి 8 రిలీజ్ చేస్తునట్టు గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడది జరగడం లేదు. డేటు, హీరో రెండు యధాతథంగా ఉండిపోయి కేవలం సినిమా మారుతోంది. అదే తేదీకి ‘గామి’ని రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమ్ పాల్గొని దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న గామికి ఈ సంవత్సరం మోక్షం దక్కుతోంది. విశ్వక్ అఘోరాగా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు.
షూటింగ్ ఆలస్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు అవసరమైన సమయం లేకపోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి బ్రేక్ వేయక తప్పలేదట. ఇది కాకుండా సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజాకు ఇటీవలే సోదరి భవతారిణి అకాల మరణం తన కుటుంబంలో విషాదాన్ని నింపింది. అందుకే రీ రికార్డింగ్ కి ఎక్కువ టైం అవసరం పడటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రౌడీ ఫెలో – చల్ మోహనరంగ ఫేమ్ చైతన్య కృష్ణ దర్శకుడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో తెరకెక్కించారని టాక్ ఉంది.
ఇక గామి విషయానికి వస్తే విద్యాధర్ దర్శకుడు. తొలుత క్రౌడ్ ఫండింగ్ తో మొదలై తర్వాత కంటెంట్ విస్తరించి పెద్ద చేతులు చేయూతనిచ్చాయి. నిజమైన కుంభమేళాను షూట్ చేసిన తొలి చిత్రంగా గామి అరుదైన ఘనతను అందుకోనుంది. హిమాలయాలు, కాశి తదితర క్లిష్టమైన లొకేషన్లలో గామి షూటింగ్ చేశారు. చాందిని చౌదరి, అభినయ, హారిక, కార్తీక్ శబరీష్ తదితరులు ఇతర తారాగణం. కమర్షియల్ అంశాలకు దూరంగా ఒక విభిన్నమైన అనుభూతిని గామి ఇస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. గ్యాంగ్స్ తప్పుకున్నా గామితో వస్తున్న విశ్వక్ సేన్ ఈసారి హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on February 7, 2024 6:18 pm
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…