విడుదల తేదీల వాయిదా ప్రహసనం కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రావాల్సిన విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ని మార్చి 8 రిలీజ్ చేస్తునట్టు గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడది జరగడం లేదు. డేటు, హీరో రెండు యధాతథంగా ఉండిపోయి కేవలం సినిమా మారుతోంది. అదే తేదీకి ‘గామి’ని రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమ్ పాల్గొని దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న గామికి ఈ సంవత్సరం మోక్షం దక్కుతోంది. విశ్వక్ అఘోరాగా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు.
షూటింగ్ ఆలస్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు అవసరమైన సమయం లేకపోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి బ్రేక్ వేయక తప్పలేదట. ఇది కాకుండా సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజాకు ఇటీవలే సోదరి భవతారిణి అకాల మరణం తన కుటుంబంలో విషాదాన్ని నింపింది. అందుకే రీ రికార్డింగ్ కి ఎక్కువ టైం అవసరం పడటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రౌడీ ఫెలో – చల్ మోహనరంగ ఫేమ్ చైతన్య కృష్ణ దర్శకుడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో తెరకెక్కించారని టాక్ ఉంది.
ఇక గామి విషయానికి వస్తే విద్యాధర్ దర్శకుడు. తొలుత క్రౌడ్ ఫండింగ్ తో మొదలై తర్వాత కంటెంట్ విస్తరించి పెద్ద చేతులు చేయూతనిచ్చాయి. నిజమైన కుంభమేళాను షూట్ చేసిన తొలి చిత్రంగా గామి అరుదైన ఘనతను అందుకోనుంది. హిమాలయాలు, కాశి తదితర క్లిష్టమైన లొకేషన్లలో గామి షూటింగ్ చేశారు. చాందిని చౌదరి, అభినయ, హారిక, కార్తీక్ శబరీష్ తదితరులు ఇతర తారాగణం. కమర్షియల్ అంశాలకు దూరంగా ఒక విభిన్నమైన అనుభూతిని గామి ఇస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. గ్యాంగ్స్ తప్పుకున్నా గామితో వస్తున్న విశ్వక్ సేన్ ఈసారి హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on February 7, 2024 6:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…