టిల్లు బాయ్ గా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ మెల్లగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు జాక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ సిద్దు బర్త్ డే సందర్భంగా చిన్న వీడియో రూపంలో టైటిల్ రివీల్ చేశారు. అయితే తమ రెగ్యులర్ స్కూల్ కి భిన్నంగా హీరో, డైరెక్టర్ ఇద్దరూ కొత్త రూటు పట్టారు. యాక్షన్ జానర్ ని ఎంచుకుని ఎక్స్ పరిమెంట్ చేయబోతున్న సంకేతం ఇచ్చారు.
సిద్దుకి బ్రేక్ ఇచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు రాబోయే టిల్లు స్క్వేర్ అన్నీ యూత్ ని టార్గెట్ చేసుకున్నావే. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నవి కాదు. అయినా వాళ్ళ ఆమోదం దక్కింది. నీరజ కోనతో చేస్తున్న తెలుసు కదా సైతం ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనరే. వీటికి భిన్నంగా జాక్ లో క్రైమ్, యాక్షన్ కలగలిసిన డిఫరెంట్ కంటెంట్ ఉంటుందని యూనిట్ టాక్. ఇలాంటి మేకోవర్ సిద్ధూకి అవసరమే. ఎందుకంటే ఒక తరహా పాత్రలకు కట్టుబడితే తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. అందుకే జాక్ తో పూర్తిగా రూటు మార్చేశాడు.
ట్యాగ్ లైన్ కొంచెం క్రాక్ అని పెట్టడం కూడా దానికి సంకేతమే. యూనిట్ లీక్ ప్రకారం ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. విడుదలకి ఇంకా ఫలానా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోలేదు. టిల్లు స్క్వేర్ మార్చ్ 29 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో దాని మీద సిద్దు చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడిని మార్చి మరీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీని కోసమే రెండేళ్ళకు పైగా ఖర్చు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ ఆరంజ్-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి క్యూట్ స్టోరీస్ డీల్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ తో యాక్షన్ కథకు చేతులు కలపడం విశేషమే.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…