టిల్లు బాయ్ గా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ మెల్లగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు జాక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ సిద్దు బర్త్ డే సందర్భంగా చిన్న వీడియో రూపంలో టైటిల్ రివీల్ చేశారు. అయితే తమ రెగ్యులర్ స్కూల్ కి భిన్నంగా హీరో, డైరెక్టర్ ఇద్దరూ కొత్త రూటు పట్టారు. యాక్షన్ జానర్ ని ఎంచుకుని ఎక్స్ పరిమెంట్ చేయబోతున్న సంకేతం ఇచ్చారు.
సిద్దుకి బ్రేక్ ఇచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు రాబోయే టిల్లు స్క్వేర్ అన్నీ యూత్ ని టార్గెట్ చేసుకున్నావే. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నవి కాదు. అయినా వాళ్ళ ఆమోదం దక్కింది. నీరజ కోనతో చేస్తున్న తెలుసు కదా సైతం ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనరే. వీటికి భిన్నంగా జాక్ లో క్రైమ్, యాక్షన్ కలగలిసిన డిఫరెంట్ కంటెంట్ ఉంటుందని యూనిట్ టాక్. ఇలాంటి మేకోవర్ సిద్ధూకి అవసరమే. ఎందుకంటే ఒక తరహా పాత్రలకు కట్టుబడితే తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. అందుకే జాక్ తో పూర్తిగా రూటు మార్చేశాడు.
ట్యాగ్ లైన్ కొంచెం క్రాక్ అని పెట్టడం కూడా దానికి సంకేతమే. యూనిట్ లీక్ ప్రకారం ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. విడుదలకి ఇంకా ఫలానా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోలేదు. టిల్లు స్క్వేర్ మార్చ్ 29 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో దాని మీద సిద్దు చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడిని మార్చి మరీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీని కోసమే రెండేళ్ళకు పైగా ఖర్చు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ ఆరంజ్-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి క్యూట్ స్టోరీస్ డీల్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ తో యాక్షన్ కథకు చేతులు కలపడం విశేషమే.
This post was last modified on February 7, 2024 3:12 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…