టిల్లు బాయ్ గా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ మెల్లగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు జాక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ సిద్దు బర్త్ డే సందర్భంగా చిన్న వీడియో రూపంలో టైటిల్ రివీల్ చేశారు. అయితే తమ రెగ్యులర్ స్కూల్ కి భిన్నంగా హీరో, డైరెక్టర్ ఇద్దరూ కొత్త రూటు పట్టారు. యాక్షన్ జానర్ ని ఎంచుకుని ఎక్స్ పరిమెంట్ చేయబోతున్న సంకేతం ఇచ్చారు.
సిద్దుకి బ్రేక్ ఇచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు రాబోయే టిల్లు స్క్వేర్ అన్నీ యూత్ ని టార్గెట్ చేసుకున్నావే. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నవి కాదు. అయినా వాళ్ళ ఆమోదం దక్కింది. నీరజ కోనతో చేస్తున్న తెలుసు కదా సైతం ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనరే. వీటికి భిన్నంగా జాక్ లో క్రైమ్, యాక్షన్ కలగలిసిన డిఫరెంట్ కంటెంట్ ఉంటుందని యూనిట్ టాక్. ఇలాంటి మేకోవర్ సిద్ధూకి అవసరమే. ఎందుకంటే ఒక తరహా పాత్రలకు కట్టుబడితే తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. అందుకే జాక్ తో పూర్తిగా రూటు మార్చేశాడు.
ట్యాగ్ లైన్ కొంచెం క్రాక్ అని పెట్టడం కూడా దానికి సంకేతమే. యూనిట్ లీక్ ప్రకారం ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. విడుదలకి ఇంకా ఫలానా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోలేదు. టిల్లు స్క్వేర్ మార్చ్ 29 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో దాని మీద సిద్దు చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడిని మార్చి మరీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీని కోసమే రెండేళ్ళకు పైగా ఖర్చు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ ఆరంజ్-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి క్యూట్ స్టోరీస్ డీల్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ తో యాక్షన్ కథకు చేతులు కలపడం విశేషమే.
This post was last modified on February 7, 2024 3:12 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…