ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న ది రాజాసాబ్ మీద ప్రకటన టైంలో అంచనాలు పెద్దగా లేవు కానీ క్రమంగా బజ్ పెరుగుతోంది. ఆ మధ్య లుంగీలో ఒక మాస్ లుక్ వదిలాక ఒక్కసారిగా హైప్ లో మార్పొచ్చేసింది. ప్రభాస్ కటవుట్ ఉంటే ఇంత అంశాల గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సినిమా హారర్ జానరనే ప్రచారం అనుమానాలు రేకెత్తించింది. అయితే ఊహించని చాలా అంశాలు ఇందులో ఉంటాయని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ చెబుతున్న మాటలు ఒక్కసారిగా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
ఆయన చెప్పడమని కాదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న విషయాలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ప్రభాస్ మేకోవర్ ఆశ్చర్యపరిచేలా ఉండటంతో పాటు తన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం షాకింగ్ గా ఉంటుందట. డార్లింగ్ లోని చిలిపితనం, మిర్చిలోని సీరియస్ నెస్ రెండూ మిక్స్ చేసి మారుతి సర్ప్రైజ్ చేస్తాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ కు ముందు జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ లో ఓ రేంజ్ లో పేలతాయట. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ లో తక్కువగా మాట్లాడిన ప్రభాస్ ఈ రాజా సాబ్ లో మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంటాడట.
సో పైకి కనిపిస్తున్న రాజాసాబ్ వేరే, లోపల చేస్తున్న రచ్చ వేరేని అర్థమైపోయింది. విడుదల మాత్రం వచ్చే ఏడాది ఉండనుంది. సంక్రాంతికి యువి క్రియేషన్స్ విశ్వంభర ఉంది కాబట్టి దానికి పోటీగా నిలిచేందుకు ప్రభాస్ స్వతహాగా ఇష్టపడడు. ఒకవేళ అది వాయిదా పడే సూచనలు ఉంటే అప్పుడు పండగ స్లాట్ తీసుకుంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డిసెంబర్ లో సోలోగా రావడమే మేలనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న రాజా సాబ్ కు తమన్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…