ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న ది రాజాసాబ్ మీద ప్రకటన టైంలో అంచనాలు పెద్దగా లేవు కానీ క్రమంగా బజ్ పెరుగుతోంది. ఆ మధ్య లుంగీలో ఒక మాస్ లుక్ వదిలాక ఒక్కసారిగా హైప్ లో మార్పొచ్చేసింది. ప్రభాస్ కటవుట్ ఉంటే ఇంత అంశాల గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సినిమా హారర్ జానరనే ప్రచారం అనుమానాలు రేకెత్తించింది. అయితే ఊహించని చాలా అంశాలు ఇందులో ఉంటాయని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ చెబుతున్న మాటలు ఒక్కసారిగా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
ఆయన చెప్పడమని కాదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న విషయాలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ప్రభాస్ మేకోవర్ ఆశ్చర్యపరిచేలా ఉండటంతో పాటు తన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం షాకింగ్ గా ఉంటుందట. డార్లింగ్ లోని చిలిపితనం, మిర్చిలోని సీరియస్ నెస్ రెండూ మిక్స్ చేసి మారుతి సర్ప్రైజ్ చేస్తాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ కు ముందు జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ లో ఓ రేంజ్ లో పేలతాయట. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ లో తక్కువగా మాట్లాడిన ప్రభాస్ ఈ రాజా సాబ్ లో మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంటాడట.
సో పైకి కనిపిస్తున్న రాజాసాబ్ వేరే, లోపల చేస్తున్న రచ్చ వేరేని అర్థమైపోయింది. విడుదల మాత్రం వచ్చే ఏడాది ఉండనుంది. సంక్రాంతికి యువి క్రియేషన్స్ విశ్వంభర ఉంది కాబట్టి దానికి పోటీగా నిలిచేందుకు ప్రభాస్ స్వతహాగా ఇష్టపడడు. ఒకవేళ అది వాయిదా పడే సూచనలు ఉంటే అప్పుడు పండగ స్లాట్ తీసుకుంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డిసెంబర్ లో సోలోగా రావడమే మేలనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న రాజా సాబ్ కు తమన్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.
This post was last modified on February 7, 2024 11:52 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…